మళ్లీ ఇద్దరు నిర్మాతల్ని కలిపిన మహేష్!

‘మహర్షి’ కోసం దిల్‌రాజు, అశ్వ‌నీద‌త్‌ను కలిపాడు మహేష్ బాబు. ఒక్క సినిమాతో ఇద్దరు నిర్మాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తరవాత మహేష్ హీరోగా ‘బ్రహ్మోత్సవం’ నిర్మించిన పివిపి ఈ సినిమాలో భాగస్వామి అయ్యారు. అదో పెద్rద కథ! ఈ సినిమాకు ఇద్దరు నిర్మాతల్ని కలిపినట్టు సందీప్ రెడ్డి వంగా సినిమాకూ ఇద్దరు నిర్మాతల్ని ఒక్కటి చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ ‘మహర్షి’ చేస్తున్నాడు. దీని తరవాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తాడు. ఆ తరవాత ‘అర్జున్ రెడ్డి’తో ఆకట్టుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా ఉంటుంది. దానికి మొత్తం ముగ్గురు నిర్మాతలు. ఏషియన్ సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, మహేష్ సొంత నిర్మాణ సంస్థ ఎంబి ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కనుంది.

‘అర్జున్ రెడ్డి’ సినిమా ను ఏషియన్ సంస్థ విడుదల చేసింది. దాంతో ఆ సంస్థకు ఓ సినిమా చేస్తానని సందీప్ రెడ్డి కమిట్ అయ్యాడు. అతన్ని మహేష్ దగ్గరకు తీసుకు వెళ్ళింది ఏషియన్ సునీల్ నారంగ్. ఇటీవల మహేష్ ప్రారంభించిన మల్టీప్లెక్స్ లో అతను భాగస్వామి కూడా. ఏషియన్ లో మహేష్ ఓ సినిమా చేయాలట. అలాగే మైత్రిలో కమిట్మెంట్ ఉంది. దాంతో సందీప్ రెడ్డి వంగ సినిమాకు ఏషియన్ సునీల్, మైత్రి అధినేతలను నిర్మాతలను చేశాడు. సుకుమార్ సినిమానూ కూడా మైత్రిలోనే చేస్తున్నాడు మహేష్. సుకుమార్, సందీప్ సినిమాలతో మైత్రిలో మహేష్ మూడు సినిమాల అగ్రిమెంట్ పూర్తవుతుంది. మహేష్ సరే అనాలి గానీ అతడితో ఎన్ని సినిమాలైనా చేయడానికి మైత్రి నిర్మాతలు సిద్ధమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close