ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్.పి.టక్కర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు రేపు పదవీ విమరణ చేయబోతున్నారు. రేపు ఆదివారం కనుక ఒకరోజు ముందుగానే సత్య ప్రసాద్ టక్కర్ ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు ఆయన రాష్ట్ర ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1981 బ్యాచ్ కి చెందిన సత్య ప్రకాష్ టక్కర్ 2004-2010 వరకు సుదీర్గ కాలం పాటు సమైక్య రాష్ట్ర సాగునీటి శాఖకి ప్రధాన కార్యదర్శిగా చేసారు. అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి వాటిని అంతే పకడ్బందీగా అమలు చేయడంలో సమర్ధుడని ఆయనకు మంచి పేరుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ 2014లో అధికారం చేపట్టిన తరువాత ప్రకటించిన ఏడు మిషన్లు-ఐదు అభివృద్ధి గ్రిడ్స్ ప్రణాళికను ఆయనే రూపొందించినట్లు సమాచారం.

సత్య ప్రకాష్ టక్కర్ బాధ్యతలు చేపట్టిన తరువాత మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలోగా అమరావతి మొదటిదశ నిర్మాణం పూర్తి చేయడం, ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ల సహాయసహకారాలతో సకాలంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి అన్నివిధాల సహకరిస్తానని తెలిపారు. రేపు పదవీ విరమణ చేయబోతున్న ఐ.వై.ఆర్.కృష్ణారావు రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ కి చైర్మన్ గా బాధ్యతలు చేపడతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close