ఈడీ టార్గెట్ చంద్రబాబే..! బాంబు పేల్చిన రేవంత్ రెడ్డి..!

ఓటుకు నోటు కేసులో.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ విచారణ… చంద్రబాబు వద్దకు వెళ్తోందా..? అవుననే అంటున్నారు రేవంత్ రెడ్డి. రెండు రోజుల పాటు ఈడీ విచారణకు హాజరైన ఆయన… కేసీఆర్‌ భుజాలపై తుపాకీ పెట్టి చంద్రబాబును కాల్చాలని మోదీ చూస్తున్నారని ఆరోపించారు. ఈడీ అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్నారు. విచారణ పేరుతో వేధిస్తున్నారని .. రెండు రోజుల పాటు అడిగిన ప్రశ్నలే అడిగి వేధిస్తున్నారని చెబుతున్నారు. కేసులో రాజకీయ కుట్ర కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు టార్గెట్‌గా ఈడీ ప్రశ్నలు ఉన్నాయని ప్రకటించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే..హైకోర్టు కొట్టేసిన కేసును తిరగదోడుతున్నారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి నేరుగా చెప్పకపోయినా… ఈడీ అధికారుల టార్గెట్ చంద్రబాబేననేది.. రాజకీయవర్గాలకు తెలిసిన విషయం. ఓటుకు నోటు కేసు దాదాపు నాలుగేళ్ల కిందటిది. ఈ కేసు హైకోర్టులో ఎప్పుడో తేలిపోయింది. ఆ కేసులో చంద్రబాబును ఇరికించడం కష్టం కాబట్టి… ఐటీ శాఖ గత ఎన్నికలకు ముందు వ్యూహాత్మకంగా.. ఈడీకి అప్పగించింది. ఆ యాభై లక్షలు ఎక్కడివో లెక్క తేల్చాలంటూ.. లేఖ రాయండతో.. హుటాహుటిన ఈడీ రంగంలోకి దిగింది. ఆ యాభై లక్షల ఆచూకీ కోసం.. ఎన్నికల ముందు… రేవంత్ రెడ్డి ఇంట్లో మూడు రోజుల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఆఫీసుకు పిలిపించి విచారించారు. ఆ తర్వాత సైలెంటయిపోయారు. ఇప్పుడు మళ్లీ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సమయంలో.. మరోసారి ఈడీ అధికారులు విచారణ పేరుతో.. రేవంత్ రెడ్డి మరికొందర్ని పిలుస్తున్నారు.

ఈ కేసులో… సండ్ర వెంకయ వీరయ్య కూడా ఉన్నారు. ఆయన టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవడతంో.. ఆయనకు ఈడీ ఎలాంటి నోటీసులు జారీ చేయడం లేదు. ఎలాంటి విచారణకు పిలవడం లేదు. కేవలం కొంతమందిని కొన్ని కేసులను టార్గెట్ గా చేసుకుని… ఈడీ విచారణ జరుపుతోంది. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులే. పెద్ద ఎత్తున కేసులు ఉన్న ఇతర నేతలు మాత్రం.. హాయిగా బయట తిరుగుతున్నారు. కానీ.. ఏదో లింక్ పెట్టుకుని.. తమకు అడ్డుగా ఉన్న నేతలపై విరుచుకుపడుతున్నారు.. దానికి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని అడ్డు పెట్టుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close