ముద్రగడ ఈ సారి తటస్థమే..!

ముద్రగడ పద్మనాభంను తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు… ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ముద్రగడతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఒక బృందంతో కలిసి వెళ్లి టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశానికి కాపు జేఏసీ నేతలు కూడా వచ్చారు. ముద్రగడకు లేదా ఆయన కుటుంబానికి టీడీపీ టికెట్‌ నేతలు ఆఫర్‌ ఇచ్చారు. రాష్ట్రమంతా ప్రచారం చేయాలని టీడీపీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే కాపు జేఏసీ నేతలకు కూడా అవకాశాలు ఇవ్వాలని ముద్రగడ కోరారు. కానీ.. టీడీపీ నేతలు మాత్రం.. ఆ విషయంపై తర్వాత చర్చిద్దామని వెళ్లిపోయారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ.. టీడీపీపై ఓ రేంజ్‌లో పోరాటం చేశారు. ఉద్యమాలు చేశారు. చివరికి… ఇప్పుడు.. కేంద్రం తెచ్చిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం కల్పించి చంద్రబాబు హామీ నిలబెట్టుకున్నారు. దీంతో ముద్రగడకు అజెండా లేకుండా పోయింది. కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సమయంలో ముద్రగడ.. చంద్రబాబుకు అనుకూలంగా మారినట్లు కనిపించారు. కానీ, ఆ తర్వాత లేఖాస్త్రాలు సంధిస్తూ చంద్రబాబుపై విమర్శలు చేయడం ప్రారంభించారు. మరోవైపు ముద్రగడను వైసీపీ వైపు తిప్పుకునేందుకు వైసీపీ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం.. ఈ సారికి తటస్థంగా ఉండాలని ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. కాపు ఉద్యమాన్ని ఉపయోగించుకుని రాజకీయ భవిష్యత్ వెదుక్కున్నారనే విమర్శలు వస్తాయని.. కాపు జేఏసీ నేతలు తిరుగుబాటు చేస్తారన్న ఉద్దేశంతో… ముద్రగడ వెనక్కి తగ్గుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో… ముద్రగడకు మంచి ఆఫర్లు ఏమైనా వస్తే.. స్పందించేందుకు అవకాశం ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close