ప్రాజెక్టులపై ఐదేళ్ల రివ్యూ : కళ్ల ముందు పోలవరం..! సీమకు కృష్ణా జలహారం..!

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధార రాష్ట్రం. సాగునీటి ప్రాజెక్టులు కీలకం. లోట్‌బడ్జెట్‌తో ప్రారంభించిన రాష్ట్రంలో… నీటి పారుదల ప్రాజెక్టుల సంగతేమిటన్న భయం చాలా మందిలో ఏర్పడింది. కానీ.. ఐదేళ్లకు ముందు.. ఐదేళ్ల తర్వాతా పరిస్థితి చూస్తే.. కచ్చితంగా… రైతులకు ధైర్యం కలుగుతుంది. 2014 తర్వాత సాగునీటి రంగంలో రూ.63,657.52 కోట్లు ఖర్చు చేశారు. 32.02 లక్షల ఎకరాలకు నీటి భరోసా కల్పించారు.

అంతకు ముందు… ఆ తర్వాత ప్రాజెక్టుల పరిస్థితి ఇదీ..!

2004-14 మధ్య 86 ప్రాజెక్టులను రూ1,90,569 కోట్ల అంచనా విలువతో చేపట్టారు. కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్‌ కూడా పూర్తి కాలేదు. పోలవరం కాలువల్ని కూడా తవ్వలేదు. 2014 తర్వతా వేగంగా పోలవరం నిర్మాణం జరిగింది. 2014 తర్వాత ఈ ప్రాజెక్టుపై రూ.10,227.92 కోట్లు చేశారు. పట్టిసీమ ఎత్తిపోతలతో గోదావరి-కృష్ణా అనుసంధానం చేశారు. 4 ఏళ్లలో 263 టీఎంసీల గోదావరి వరద జలాలను మళ్లీంచారు. ఈ నీటితో కృష్ణా డెల్టాలో పంటలను కాపాడారు. రాయలసీమ కరవు ప్రాంతాలకూ నీటి సరఫరా. పోతిరెడ్డిపాడు ద్వారా ఈ ఏడాది 115.40 టీఎంసీలు, ముచ్చుమర్రి ద్వారా 31.65 టీఎంసీల తరలించారు. దీంతో వర్షాభావం ఉన్నా… కరువు అనే పరిస్థితి పెద్దగా ఎక్కడా రాలేదు. ఈ ఐదేళ్ల కాలంలో.. ప్రభుత్వం.. రైతులకు ఇచ్చిన భరోసా ఇదే. హిందూపురం నియోజకవర్గానికి కూడా.. కృష్ణా నీరు చేరడం.. కొత్త చరిత్రగా చెప్పుకోవచ్చు.

కరువును జయించే యజ్ఞంలో ముందడుగే..!

రాష్ట్రంలో మొత్తం 62 ప్రాధాన్య ప్రాజెక్టులుగా గుర్తించారు. ఇప్పటికే 17 ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రారంభించారు. మరో 6 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 26 ప్రాజెక్టుల్లో వేగంగా పనులు సాగుతున్నాయి. మరో 13 ప్రాజెక్టులు కొత్తగా నిర్మించేందుకు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్రాన్ని కరవు రహితంగా చేయడం, 2 కోట్ల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. బహుద, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల్ని అనుసంధానించనున్నారు. 62 సాగునీటి ప్రాజెక్టుల్లో గోదావరి-పెన్నా అనుసంధానం, బొల్లాపల్లి దగ్గర రిజర్వాయర్‌ నిర్మాణం తప్ప మిగతావన్నీ మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో 140 చిన్న, పెద్ద నదులున్నాయి. వాటన్నింటినీ కాలువలకు అనుసంధానం చేస్తే గ్రావిటీ, లిఫ్ట్‌ల ద్వారా 2 కోట్ల ఎకరాలకు నీరు ఇవ్వగలమంటున్నారు.

ఎన్నికలకు ముందు కొత్త ప్రణాళికలు..!

కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజికి దిగువన మరో కొత్త బ్యారేజి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లాలోని వరకపుడిశిల వద్ద ఓ ఎత్తిపోతల పథకం నిర్మించి గురజాల, మాచర్ల రెండు నియోజకవర్గాల్లోని ఆనకట్టుకు ప్రయోజనం కల్పించనున్నారు. సోమశిల-స్వర్ణముఖి అనుసంధాన కాలువ నుంచి చిత్తూరు జిల్లాలోని బాలాజీ జలాశయానికి నీరు తరలించనున్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా మల్లెమడుగు, బాలాజీ జలాశయాలకు మరో వైపు నుంచి నీటిని మళ్లించే ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల ప్రకటన రాక ముందే రూ.6326.62 కోట్లతో వంశధార-బాహుదా అనుసంధానం పనులు, పశ్చిమ కృష్ణాలో మెట్ట ప్రాంత అవసరాలు తీర్చేలా రూ.698.90 కోట్లతో విస్సన్నపేట ఎత్తిపోతల పనులకు దీని ప్రకారం ఆమోదం లభించింది. విస్సన్నపేట ఎత్తిపోతల పథకం వల్ల కృష్ణా జిల్లా 5 మండలాల్లోని 50 వేల ఎకరాలకు ప్రయోజనం కలగనుంది.

పోలవరం కళ్ల ముందు కనిపిస్తోంది. రాయలసీమలో కృష్ణా నీళ్లు పారుతున్నాయి. అనంతపురం జిల్లా కూడా పచ్చబడింది. ఈ ఐదేళ్లలో వచ్చిన అనూహ్యమైన మార్పు ఇదే. రోజూ చూసేవారికి ఎదుగుదల కనిపించదు కానీ.. ఐదేళ్ల కిందట… ప్రాజెక్టుల పరిస్థితి.. ఇప్పటి పరిస్థితి అంచనా వేస్తే.. పురోగతి ఎక్కువగానే కనిపిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close