పవన్ తో బాబుకు కష్టమే

ఒక పద్దతి వుంటే వేరు. అది లేకపోతే వేరు. పవన్ కళ్యాణ్ వ్యవహారం తో చంద్రబాబుకు అంత వీజీగా వుండేలా లేదు వ్యవహారం. గత ఎన్నికల టైమ్ లో పవన్ నేరుగా పోటీ చేయలేదు. పైగా నేరుగా మద్దతు పలికారు. అందువల్ల సమస్య ఏమీ లేదు. కానీ ఈసారి ముందుగానే ఆయన ఎందుకో యాంటీ టీడీపీ స్టాండ్ చటుక్కున తీసేసుకున్నారు. దాని నుంచి మరి వెనక్కు వెళ్లలేకపోయారు. పోనీ అలా అని నేరుగా తెలుగుదేశం, వైకాపాలను ఢీ కొట్టే సాహసం పూర్తిగా చేయలేకపోయారు. దీనికి కారణం ధైర్యం లేక కాదు. ఓపిక లేక.

175 నియోజకవర్గాలు, కమిటీలు, బాధ్యులు, వారి నిర్వహణ, వారి కంట్రోలు వంటివి పవన్ వల్ల కాలేదు. ఇదిగో కమిటీలు అదిగో కమిటీలు అంటూనే సాగదీసుకుంటూ వచ్చారు. ఆఖరికి అలాంటివి ఏవీ లేకుండానే జనం ముందుకు ఎన్నికలకు వచ్చేసారు. నిజానికి ఇది చాలా తప్పుడు వ్యూహం. ఎంత చరిష్మా వున్నా, ఎంత ఇమేజ్ వున్నా, కింది స్థాయిలో కేడర్ ను ఆర్గనైజ్ చేయడం అన్నది చాలా అవసరం. పోల్ మేనేజ్ మెంట్ కు ఇది ఇంకా అవసరం.

పోనీ పవన్ కు సీట్లు వస్తే ఏమిటి పోతే ఏమిటి? అని అనుకుంటే, తెలుగుదేశం పార్టీకి ఇదే సమస్యగా మారుతోంది. అసలు పవన్ అనే వాడు ఎవరి ఓట్లు పట్టుకెళ్తాడు అన్న దాంట్లో క్లారిటీ లేదు. రాజకీయ వర్గాలు ఈ విషయంలో తల పట్టుకుంటున్నాయి. పవన్ పార్టీ పోటీ చేసే చోట్లు తెలుగుదేశం పరిస్థితి ఎలా వుంటుంది? వైకాపా పరిస్థితి ఎలా వుంటుంది అన్నది అంతు పట్టడం లేదు. కాపులకు దేశంపై కోపం వుంది అందువల్ల పవన్ కు పడే కాపు ఓట్లు దేశానివే అని అనుకుందాం. అప్పుడు కూడా ఆ ఓట్లు వైకాపాకు వెళ్లకపోవడం వల్ల దేశానికి ప్లస్ అవుతుందా? లేదా దేశానికి వెళ్లే ఓట్లు పవన్ కు వెళ్లి, వైకాపాకు ప్లస్ అవుతుందా అన్న ఈక్వేషన్ కు అంత సులువుగా సమాధానం దొరికేలా లేదు.

పోనీ ఓట్లు ఎలా పడతాయి..ఎవరి ఓట్లు పవన్ కొల్ల గొడతారు అన్న సంగతి తెలియడం లేదు అన్నది పక్కన పెడితే, అసలు పవన్ పోటీ సీరియస్ గానా? లోపాయకారీ ఒప్పదం వుందా? అన్నది కూడా అంతు పట్టడం లేదు. అనకాపల్లిలో మంత్రి గంటా బంధువుకు సీటు ఇచ్చారు పవన్. కానీ మళ్లీ అదే పవన్ భీమవరంలో గంటా వియ్యంకుడు మీద పోటీ చేస్తున్నారు. గాజువాకలో తెలుగుదేశం పార్టీకి కీలకమైన సీటులో పోటీ పడుతున్నారు. అక్కడ యాదవులపై కాపుల పోటీ అన్న కలర్ రావడం అన్నది మిగిలిన నియోజకవర్గాల్లో ప్రభావం చూపించే అవకాశం వుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.

పవన్ వరకు బాగానే వున్నారు. కానీ పవన్ తో లోపాయకారీ ఒప్పందం వుందన్న ప్రచారం తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే ప్రమాదం వుంది. పవన్ విషయంలో తెలుగుదేశం పార్టీ కాస్త మెతకవైఖరి అవలంబిస్తోంది. ఇది కచ్చితంగా జనాల్లోకి రాంగ్ సిగ్నల్స్ పంపిస్తుంది. పవన్ చేసే తప్పులు తెలుగుదేశం ఖాతాకు ఇబ్బంది తెచ్చే ప్రమాదం వుంది.

పవన్ కు జగన్ కు చుక్కెదురు అన్నది క్లియర్ గా క్లారిటీగా జనంలోవుంది. కానీ పవన్ కు తెలుగుదేశానికి చుక్కెదురు అన్నది క్లారిటీగా జనంలోకి వెళ్లలేదు. ఎన్నికల అనంతరం పవన్ కు వచ్చే సీట్లు తెలుగుదేశానికే బలంగా వుంటాయన్న అభిప్రాయం జనంలో వుంది. అది వాస్తవం. ఇది ఇరు పార్టీల ఓటు బ్యాంకును ఏ మేరకు ఫ్రభావితం చేస్తుందన్నది అనుమానం.

ఇదిలా వుంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఎన్నికల ప్రచారం ప్రారంభించలేదు. ఆయన ప్రసంగాలు ఏ రీతిగా సాగుతాయన్నది చూడాలి. గతంలో మాదిరిగా కప్పదాటుగానే గోడ మీద కూర్చుని మాట్లాడుతారా? తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తారా? అన్నది చూడాల్సి వుంది. అప్పుడు దాని పర్యవసానాలు వేరుగా వుంటాయి.

ఇవన్నీ అలా వుంచితే రాయలసీమలో జనసేన బాగా కాన్సన్ ట్రేట్ చేయలేదు. వాస్తవానికి వైకాపా బలం రాయలసీమలో కాస్త ఎక్కువ. జనసేన ఓట్ బ్యాంక్ కూడా అక్కడ కాస్త వుంది. కానీ ఆ ప్రాంతాన్ని అలాగే వదిలేసారు. జేడీ లక్ష్మీనారాయణ స్వంత ఏరియా రాయలసీమ. ఆయనను అయినా అక్కడ పోటీకి నిలపాల్సింది. కానీ అలా చేయకుండా తీసుకెళ్లి ఉత్తరాంధ్రలో పెట్టారు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి కాస్త ఇబ్బందికర పరిణామమే.

ఇలా ఒక తీరుగా కాదు, ఎన్నికల తరువాత ఎలా వుంటుందో కానీ, ముందు అయితే మాత్రం జనసేనతో బాబు పార్టీకి ఇబ్బందిగానే వుంది. నేరుగా విమర్శలు చేయడం లేదు. జగన్ ను విమర్శిస్తున్నారు. లోకేష్ మీద పోటీ పెట్టలేదు. ఇవి మాత్రమే పాజిటివ్ పాయింట్లు. మిగిలిన వ్యవహారం అంతా నెగిటివ్ నే. ఆ విషయం ఎన్నికల తరువాత స్పష్టం కావచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close