55 ఏళ్లకే “పెన్షన్”.. ప్రతి ఏడాది “పసుపు – కుంకుమ”..! టీడీపీ తురుపుముక్కలు..!

ఎన్నికల్లో ఓట్లు తెచ్చి పెట్టేవి జనాకర్షణ హామీలే. టీడీపీ వీటిపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ .. యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఓ మేనిఫెస్టో కమిటీని నియమించింది. ఆ కమిటీ కూడా.. మేనిఫెస్టోను సిద్ధం చేసింది. చంద్రబాబు తుదిమెరుగులు దిద్దారు కూడా. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే .. తమ హామీలను కొన్నింటిపై మీడియాకు సమాచారం ఇచ్చింది. గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు… రాబోయే ఐదేళ్లకు తీసుకునే ప్రణాళికలను మేనిఫెస్టో లో పొందుపరిచినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

రైతులకు పగటిపూట 12గంటల ఉచిత విద్యుత్, అన్నదాత సుఖీభవ పథకం వచ్చే ఐదేళ్లు పొడిగింపు , 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, 2019కల్లా పోలవరం పూర్తి చేసి 40లక్షల ఎకరాలకు నీరు, వృధ్యాప్య పెన్షన్ వయసు 65 నుంచి 55 సంవత్సరాలకు తగ్గించడం, మహిళలకు పసుపు-కుంకుమ పథకం ప్రతి ఏటా కొనసాగింపు, చంద్రన్న బీమా రూ. 5 లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచడం, ప్రతికుటుంబానికి నెలకు రూ. 15వేలు వచ్చేలా చర్యలు, రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి అన్న క్యాంటీన్లు ఏర్పాటు, అన్ని వర్గాల ప్రజలకు చంద్రన్న పెళ్లికానుక ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టనున్నారు.

వైసీపీ మేనిఫెస్టోలోని అంశాలు మాత్రం బయటకు రావడం లేదు. అయితే నవరత్నాల్లోని కొన్ని అంశాలను.. చంద్రబాబు ఇప్పటికే అమలు చేయడం ప్రారంభించారు. దాంతో.. వాటిల్లో పెంపును చూపిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి..తాను ఎన్నో హామీలు ఇవ్వనని.. రెండు అంటే..రెండు పేజీల్లోనే మేనిఫెస్టోను ప్రకటిస్తానని పదే పదే చెప్పారు. అందుకే.. పరిమితంగానే… మేనిఫెస్టోల్లో హామీలు ఉండే అవకాశం ఉంది…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close