విష్ణు బ‌ల‌వంతంపైనే మోహ‌న్ బాబు ఆ నిర్ణ‌యం తీసుకున్నాడా?

విద్యానికేత‌న్ ఫీజుల చెల్లింపుల విష‌యంలో రోడ్డుకెక్కి.. చంద్ర‌బాబు నాయుడుపై పోరాటం మొద‌లెట్టిన‌ప్పుడే.. మోహ‌న్ బాబు త్వ‌ర‌లో రాజ‌కీయంగా ఓ నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌న్న విష‌యం జ‌నాల‌కు అర్థ‌మైంది. నాలుగు రోజులు తిర‌క్క‌ముందే.. ఆయ‌న వైకాపా పార్టీలో చేరి, ఆ కండువా క‌ప్పుకోవ‌డం ఎవ్వ‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌లేదు. అయితే.. మోహ‌న్ బాబు వైకాపాలో చేర‌డానికి విష్ణు నే ప్ర‌ధాన కార‌ణం అని తెలుస్తోంది. కొంత కాలంగా మోహ‌న్ బాబు రాజ‌కీయాల విష‌యంలో త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అన్ని పార్టీల‌లోనూ ఆయ‌న‌కు కావ‌ల్సిన‌వాళ్లు ఉన్నారు. అందుకే.. ఆ మైత్రీ బంధం కొన‌సాగించ‌డం కోసం.. మౌనంగా ఉండిపోయారు. బీజేపీలో మోహ‌న్ బాబు చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆయ‌న సొంతంగా పార్టీ స్థాపిస్థార‌ని కూడా అనుకున్నారు.

అయితే వైకాపాలో చేర‌మ‌ని బ‌ల‌వంతం చేసింది మాత్రం విష్ణునేన‌ట‌. కొన్ని రోజుల క్రితం విష్ణు జ‌గ‌న్‌ని క‌లిశారు. అప్పుడే.. మంచు ఫ్యామిలీ వైకాపాలో వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు అర్థ‌మైంది. ఆరోజే.. మోహ‌న్ బాబు చేరిక‌కు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించిన‌ట్టైంది. అయితే అటు మ‌నోజ్‌కి గానీ, ఇటు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌కు గానీ.. వైకాపాలో చేర‌డం ఇష్టం లేద‌ని స‌మాచారం. ఎన్నిక‌ల ముందు పార్టీలు మారడం క‌రెక్ట్ కాద‌ని, పైగా ఎన్నిక‌ల‌లో పోటీ చేసే ఉద్దేశం లేన‌ప్పుడు ఎలాంటి ఉప‌యోగం ఉండ‌ద‌ని గ‌ట్టిగా చెప్పారట. మోహ‌న్ బాబు కూడా ఈ విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డ్డార‌ని, అయితే ఎన్నిక‌ల‌లో గాలి జ‌గ‌న్‌వైపే ఉంద‌ని గ్ర‌హించిన మోహ‌న్ బాబు, ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర‌వాత కంటే, ముందే.. ఆ పార్టీలో చేరితో మంచిద‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఓ ద‌శ‌లో తిరుప‌తి నుంచి మోహ‌న్ బాబు టికెట్టు కోసం ప్ర‌య‌త్నించార‌ని, జ‌గ‌న్ కాద‌న‌డంతో.. పోటీ చేసే ఆలోచ‌న విర‌మించుకున్న‌ట్టు స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

ఆ ఛానెల్ పై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన మాజీ మంత్రి

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. డీప్ ఫేక్ ఆడియోతో పరువు నష్టం కలిగించారని ఓ న్యూస్ ఛానెల్ యాజమాన్యం, రిపోర్టర్ కు పువ్వాడ...

‘విశ్వంభ‌ర‌’లో ప‌వ‌న్‌.. అంత సీన్ ఉందా?

చిరంజీవి న‌టిస్తున్న సోషియో ఫాంట‌సీ చిత్రం 'విశ్వంభ‌ర‌'. వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌. ఈ చిత్రంలో చిరంజీవి భీమ‌వ‌రం దొర‌బాబుగా, ఐదుగురు చెల్లెమ్మ‌ల‌కు అన్న‌య్య‌గా క‌నిపించ‌నున్నారు. దాదాపు 40...

రివర్స్ ప్రచారం : మేనిఫెస్టో గురించి చెప్పుకోలేని జగన్ !

అధికార పార్టీ నేతగా.. సీఎంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్ ప్రచారసభల్లో ఏం చెబుతున్నారు ?. మళ్లీ గెలిస్తే ఏం చేస్తానో చెబుతున్నారా ?. తన మేనిఫెస్టో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close