గవర్నర్‌ ఏపీ అధికారపక్షానికి బాగా సహకరించారంటున్న కోడెల..!

తెలుగుదేశం పార్టీ నేతలకు గవర్నర్ నరసింహన్ అంటే ఎంత ఆగ్రహం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అత్యవసరం, తప్పదు అనుకుంటే తప్ప.. గవర్నర్ కు మొహం చూపించడానికి కూడా ఇష్టపడరు టీడీపీ నేతలు. ఆయన పూర్తిగా.. టీడీపీకి వ్యతిరేకంగా.. టీఆర్ఎస్, వైసీపీలకు సహకరిస్తున్నారని.. రాజ్‌భవన్‌లో రాజకీయం చేస్తున్నారని నమ్మకం కుదిరిన తర్వాత .. అధికారికంగా.. గవర్నర్ ఇచ్చే టీ పార్టీలకు కూడా మొహం చాటేస్తున్నారు. అయితే హఠాత్తుగా… గవర్నర్‌తో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు భేటీ అయ్యారు. భేటీ తర్వాత ఆయన ఓ రకంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షానికి గవర్నర్ బాగా సహకరించారని చెప్పుకొచ్చారు. అసలు గవర్నర్ సహకరించలేదని.. పైగా ప్రభుత్వంపై కుట్రలు చేశారని…ముఖ్యమంత్రి చంద్రబాబు సహా.. అనేక మంది టీడీపీ నేతలు పలుమార్లు ఆరోపించారు.
అయితే..కోడెల మాత్రం డిఫరెంట్ వెర్షన్ వినిపించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తో కోడెల సమావేశమయ్యారు. తాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ హోదాలో… గవర్నర్‌తో సమావేశమయ్యానని.. స్పీకర్ చెప్పుకొచ్చారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించి ఐదేళ్లయినందునే ..మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. ఏపీ ఎన్నికల్లో జరిగిన ఘర్షణలు, హింసపై గవర్నర్‌కు వివరించానన్నారు. కోడెల ఇలా ఒక్కసారిగా గవర్నర్ కు అనుకూలంగా మాట్లాడటం.. ఏపీ రాజకీయవర్గాల్లో .. కాస్త సంచలనం అయింది. పోలింగ్ రోజు జరిగిన ఘర్షణల్లో..  ఇనిమెట్ల అనే గ్రామంలో… కోడెల బూత్ క్యాప్చరింగ్ కు పాల్పడ్డారని.. వైసీపీ కొద్ది రోజుల కిందట గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసులు కోడెలపై కేసు నమోదు చేశారు.
సీసీ టీవీ ఫుటేజీ  బయటపెడితే అసలు నిజమేమిటో తెలుస్తుందని డిమాండ్ చేస్తున్నప్పటికీ.. ఈసీ స్పందించలేదు. ఈ క్రమంలోనే కోడెల… అనూహ్యంగా గవర్నర్‌తో సమావేశం కావడం… ఆయన బాగా సహకరిస్తున్నారని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.  అయితే కోడెల ఆ మాటలను సీరియస్‌గా కాకుండా..సెటైర్‌గా అనిఉంటారని.. కొంత మంది అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close