ఫెయిలైన విద్యార్థులంద‌రికీ ఫ్రీ రీవెరిఫికేష‌న్‌

తెలంగాణ‌లో వివాదాస్ప‌దంగా మారిన ఇంట‌ర్ ఫ‌లితాల తీరుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. విద్యాశాఖ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డితోపాటు కార్య‌ద‌ర్శుల‌తో సీఎం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇంట‌ర్ లో ఫెయిలైన విద్యార్థిలంద‌రి పేప‌ర్ల‌ను ఉచితంగా రీవెరిఫికేష‌న్ చేయాల‌ని బోర్డుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రీవేల్యూయేష‌న్, రీకౌంటింగ్ ఈ రెండు ఉచితంగానే జ‌రగాల‌ని అధికారుల‌కు సీఎం చెప్పారు. ఈ ప్ర‌క్రియ‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌నీ, అడ్వాన్స్ స‌ప్ల‌మెంట‌రీ ప‌రీక్ష‌ను వీలైనంత త్వ‌ర‌గా నిర్వ‌హించాల‌నీ, విద్యార్థులు విద్యాసంవ‌త్స‌రం న‌ష్ట‌పోకుండా చూడాల‌ని సీఎం అన్నారు. రీవేల్యూయేష‌న్‌, రీ వెరిఫికేష‌న్లతోపాటు స‌ప్ల‌మెంట‌రీ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల్ని విద్యాశాఖ కార్య‌ద‌ర్శి జనార్థ‌న్ కు ముఖ్య‌మంత్రి అప్ప‌గించారు.

ఇంట‌ర్ బోర్డులో త‌లెత్తిన వివాదంపై ముఖ్య‌మంత్రి స్పందిస్తూ… ఈ వివాదానికి గ‌ల కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ సంద‌ర్భంలో సీఎం మాట్లాడుతూ… ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ను పూర్తిగా ఒక స్వ‌తంత్ర సంస్థ‌కు ఇస్తే ఎలా ఉంటుంద‌నీ, వివాదాల‌కు ఏమాత్రం ఆస్కారం లేని విధంగా ఈ వ్య‌వ‌స్థ‌ను త‌యారు చేయాల్సి ఉంద‌ని అన్నారు. ఇంట‌ర్ బోర్డులో గ‌త కొన్నాళ్లుగా వివాదాలు న‌డుస్తున్నాయ‌న్న అంశం సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చార‌నీ, ఈ సంద‌ర్భం ఆయ‌న వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

ముఖ్య‌మంత్రి తాజాగా ప్ర‌క‌టించిన నిర్ణ‌యంతో దాదాపు 3 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు కొంత ఊర‌ట ల‌భించిన‌ట్టే. అయితే, ఫ‌లితాలు వెలువ‌డ్డ త‌రువాతి నుంచీ రీవేల్యుయేష‌న్ కోసం ఇప్ప‌టికే చాలామంది విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా ఫీజులు చెల్లించారు. స‌బ్జెట్ కి రూ. 600 చొప్పున చాలామంది క‌ట్టారు. వీరు చెల్లించిన ఫీజుల్ని వాప‌సు ఇస్తారో లేదో ఇంకా స్ప‌ష్టంగా అధికారులు వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంది. ఉచిత రీవెరిఫికేష‌న్ తో విద్యార్థుల‌కు కొంత ఊర‌ట‌. అయితే, ఈ గంద‌ర‌గోళానికి కార‌ణ‌మైన వారిపై చ‌ర్య‌లు క‌ఠినంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌కి కేవ‌లం ఉచిత రీవెరిఫికేష‌ర్ ఒక్క‌టే ప‌రిష్కారం కాదు క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close