ఎగ్జిట్ పోల్స్ షాక్..! విపక్షాల భేటీ ఫలితాలే తర్వాతే..!

బీజేపీని గద్దె దింపడానికి ఎలాంటి అవకాశం వచ్చినా.. వదిలి పెట్టకూడదన్న ప్రయత్నాల్లో ఉన్న.. బీజేపీయేతర పార్టీలకు ఎగ్జిట్ పోల్స్ ఒక షాకే. కానీ ఆ పార్టీలేమీ నమ్మడం లేదు. అయితే.. తొందరపాటు ఎందుకన్న పద్దతిలో.. ఫలితాల తర్వాతే సమావేశం అవుదామన్న ఆలోచనలో పడ్డాయి.

ఫలితాలను ఇస్తున్న చంద్రబాబు చర్చలు..!

బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే.. ప్రయత్నాలను చంద్రబాబు మరింత ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌ వైపు నుంచి చూపాల్సిన చొరవపై.. 23న ఫలితాలకు ముందే క్లారిటీకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో.. చంద్రబాబు మార్క్ రాజకీయం సత్ఫలితాలు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెస్ తో పాటు కూటమి కట్టడానికి వెనుకడుగు వేస్తున్న పార్టీలు.. ఇప్పుడు మెత్తబడినట్లు ప్రచారం జరుగుతోంది.

కూటమి భేటీకి వచ్చేందుకు మాయావతి సంసిద్ధత..!

శనివారం లక్నో వెళ్లి మాయావతి, అఖిలేష్‌లతో భేటీ అయిన చంద్రబాబు భేటీకి వచ్చే విషయంపై చర్చలు జరిపారు. ఆ చర్చల వివరాలను ఆదివారం ఉదయం రాహుల్ గాంధీ, శరద్ పవార్‌లకు చంద్రబాబు వివరించారు. విపక్షాల కూటమి భేటీకి.. కాస్త తగ్గి అయినా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, మమతా బెనర్జీలు విపక్షాల కూటమి భేటీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రధానమంత్రి పదవి విషయంలో అన్ని పార్టీలు.. ఏకాభిప్రాయానికి రావడానికి చంద్రబాబు ఓ ఫార్ములా ప్రతిపాదించారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి 140కిపైగా సీట్లు వస్తే ఆ పార్టీకి.. లేకపోతే.. ప్రాంతీయ పార్టీల నుంచి ఓ అభ్యర్థికి మద్దతివ్వాలన్న ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.

త్యాగాలు చేయడానికి కాంగ్రెస్ రెడీ..!

విపక్ష పార్టీల ఆలోచనలు, అభిప్రాయాలను వివరించేందుకు చంద్రబాబు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. సోనియాతో చంద్రబాబు భేటీ ఇదే తొలి సారి. విపక్ష పార్టీలతో చర్చల వివరాలను.. చంద్రబాబు… సోనియా గాంధీకి వివరించారు. బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 21 లేదా 22న ఎన్డీయేతర పక్షాల సమావేశం ఉంటుందని ప్రాధమికంగా నిర్ణయించారు. అయితే ఎగ్జిట్ పోల్స్ నిరాశజనకంగా ఉండటంతో… ఇప్పుడు మనసు మార్చుకునే అవకాశం ఉంది. ఫలితాలు అనుకూలంగా వస్తే 23న సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కచ్చితంగా.. హంగ్ పార్లమెంట్ వస్తుంది.. బీజేపీయేతర పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని.. నమ్ముతున్న చంద్రబాబు…. పార్టీలతో మరితం విస్తృతంగా సంప్రదింపులు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close