ప్ర‌త్యేక హోదాపై ప్ర‌ధాని మ‌న‌సు క‌ర‌గాలంటున్న ఏపీ సీఎం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా సాధ‌న‌… ఎన్నిక‌ల‌కు ముందు వైకాపా చేసిన వాగ్దానాల్లో ఇది చాలా ప్ర‌ముఖ‌మైంది. పెద్ద సంఖ్య‌లో ఎంపీలను గెలిపిస్తే, కేంద్ర ప్ర‌భుత్వం నుంచి హోదా సాధించి తీర‌తామ‌న్నారు. హోదాకి మ‌ద్ద‌తు ఇచ్చే ప్ర‌భుత్వానికే కేంద్రంలో మ‌ద్ద‌తు ఇస్తామ‌న్నారు. కానీ, ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం…. ఎవ్వ‌రి మ‌ద్ద‌తు అవ‌స‌రం లేకుండా కేంద్రంలో మ‌రోసారి మోడీ స‌ర్కారు కొలువు దీరింది. దీంతో ప్ర‌త్యేక హోదా అంశంపై ఏపీ అధికార పార్టీ వైకాపా కూడా వైఖ‌రి మార్చుకుంది. తాను ఢిల్లీ వెళ్లిన‌ప్పుడ‌ల్లా కేంద్రాన్ని హోదా ఇమ్మంటూ కోరుతూనే ఉంటాన‌నీ, ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్తే అన్నిసార్లూ ఇదే త‌ర‌హా ప్ర‌య‌త్నం కొన‌సాగిస్తూనే ఉంటా అన్నారు సీఎం జ‌గ‌న్. అదే అంశాన్ని ఇవాళ్ల మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ వెళ్లారు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ త‌రువాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధించిన అంశాల‌న్నీ కేంద్ర హోం శాఖ ప‌రిధిలోకి వ‌స్తాయి కాబ‌ట్టి హోం మంత్రిని క‌లిశామ‌న్నారు. ప్ర‌త్యేక హోదా విష‌య‌మై ఆయ‌న్ని కూడా రిక్వెస్ట్ చేశామ‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మ‌న‌సు క‌రిగించేలా మంచి మాట‌ల‌ను చెప్పండి అంటూ అమిత్ షాను కోరామ‌న్నారు జ‌గ‌న్. రేపు జ‌ర‌గ‌బోయే నీతీ ఆయోగ్ లో కూడా ఇవే అంశాల‌పై తాను మ‌రోసారి మైక్ ప‌ట్టుకుని మాట్లాడతా అన్నారు ఏపీ సీఎం. దేవుడి ద‌య‌తో అది (ప్ర‌త్యేక హోదా) వ‌చ్చే దాకా, ఢిల్లీకి వ‌చ్చిన ప్ర‌తీ సంద‌ర్భంలో మ‌ర‌చిపోకుండా ఇలా చూపిస్తూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామ‌న్నారు జ‌గ‌న్. ఇలా అడుగూతూ పోతుంటామ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

ప్ర‌త్యేక హోదా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌న‌సు బాగున్న‌ప్పుడు తీసుకునే నిర్ణ‌యంగానో, లేదా ఆయ‌న‌కు మాంచి మూడ్ ఉన్న‌ప్పుడు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అంశంగానే ఏపీ ప్ర‌భుత్వం చూస్తున్న‌ట్టుగా ఉంది. ఎన్నిక‌ల ముందు ఇదే మోడీ స‌ర్కారుపై హోదా అంశ‌మై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన వైకాపా… అధికారంలోకి వ‌చ్చాక కేంద్రంతో సామ‌ర‌స్య పూర్వ‌క వైఖ‌రితోనే ముందుకు సాగుదామ‌ని నిర్ణ‌యించుకుంది. అందుకే, ఢిల్లీ వెళ్లిన‌ప్పుడ‌ల్లా మెల్ల‌గా అడుగుతూ ఉంటామ‌న్నారు సీఎం జ‌గ‌న్. సామ‌ర‌స్యంగా డిమాండ్ చేయ‌డంలోనూ త‌ప్పు లేదు. కానీ, క్ర‌మ‌క్ర‌మంగా ఏపీ హోదా, విభ‌జ‌న హామీలు అమ‌లు అనేవి ప్ర‌ధాన‌మంత్రి వ్య‌క్తిగ‌త వైఖ‌రి బ‌ట్టీ తీసుకునే నిర్ణ‌యాలుగా ఏపీ ప్ర‌భుత్వం చూస్తున్న‌ట్టుగా ప‌రిస్థితి మారుతోంద‌ని అనిపిస్తోంది. ఒక రాష్ట్ర హ‌క్కులు, కేంద్రం ఇచ్చిన హామీలు అనేవి… కేంద్రంలో అధికార పార్టీకి ఉన్న సంఖ్యాబ‌లాన్ని బ‌ట్టీ అమ‌లు చేయ‌డం అంటూ ఉండ‌కూడ‌దు క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close