ఏపి సచివాలయ నిర్మాణానికి రెండే కంపెనీలు పోటీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి విదించిన కొన్ని షరతుల వలన కేవలం రెండే రెండు కంపెనీలు టెండర్లు వేశాయి. ఎల్ అండ్ టి మరియు షాపూర్ జీ పల్లోంజి అండ్ కంపెనీ లిమిటెడ్ సంస్థలు వేసిన టెండర్లను సి.ఆర్.డి.ఏ. చీఫ్ ఇంజనీర్ కాశీ విశ్వేస్వర రావు, ప్రొక్యూర్ మెంట్ డైరెక్టర్ ఆంజనేయుల సమక్షంలో నిన్న సాయంత్రం తెరిచారు. అవి కేవలం సాంకేతిక టెండర్లు మాత్రమే. ఆ రెంటిలో ఏ కంపెనీకి అటువంటి తాత్కాలిక భవనాలను వేగంగా మరియు నాణ్యతగా నిర్మించడంలో అనుభవం ఉందో పరిశీలిస్తారు. ఒకవేళ రెంటికీ తగిన అర్హత, అనుభవం ఉన్నట్లయితే ఈనెల 10న ఫైనాన్సియల్ బిడ్డింగ్ టెండర్లను తెరుస్తారు. వాటిలో ప్రభుత్వం వేసిన నిర్మాణ అంచనా రూ. 180 కోట్ల కంటే ఏ సంస్థ తక్కువకు ఈ పని చేయడానికి ముందుకు వస్తుందో దానికే ఈ పనిని అప్పగిస్తారు.

సచివాలయంలో ఒక బ్లాకుకి రెండేసి భవనాల చొప్పున మూడు బ్లాకులలో మొత్తం ఆరు భవనాలను ‘ప్రీ-ఫాబ్రికేటడ్’ పద్దతిలో నిర్మించాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టు దక్కించుకొన్న సంస్థతో 10వ తేదీనే ఒప్పందం చేసుకొని అదే రోజున వర్క్ ఆర్డర్ కూడా అందజేయబడుతుంది. ఒప్పందం ప్రకారం ఆరు నెలలోగా ఆరు భవనాలను నిర్మించి, ప్రభుత్వానికి అప్పగించవలసి ఉంటుంది. నాలుగు నెలలోనే నిర్మాణం పూర్తి చేయగలిగితే నిర్మాణ వ్యయంలో 2 శాతం, ఐదు నెలలలో పూర్తి చేయగలిగితే ఒక్క శాతం చొప్పున అదనంగా చెల్లించబడుతుంది ఒకవేళ ఆరు నెలల కంటే ఆలస్యమయితే నిర్మాణ వ్యయంలో 10 శాతం జరిమానా విధించబడుతుంది.

నిర్మాణ స్థలాన్ని చదును చేయడం, అక్కడికి యంత్రాలను, నిర్మాణ సామాగ్రిని, కార్మికులను తరలించడం, ప్రీ ఫాబ్రికేటడ్ గోడలను, కప్పులను సిద్దం చేసుకోవడం వంటి అనేక పనులన్నీ ఏకకాలంలో, చాలా పద్ధతి ప్రకారం చేయవలసి ఉంటుంది. అప్పుడే గడువులోగా నిర్మాణం పూర్తి చేయడం సాద్యం అవుతుంది. లేకుంటే బారీగా జరిమానా చెల్లించవలసి వస్తుంది కనుక కాంట్రాక్టు దక్కించుకొన్న కంపెనీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే చాలా కంపెనీలు టెండర్లు వేసేందుకు సాహసించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close