కోట్ల మాటలకు అర్థాలే వేరులే!

కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఒకప్పట్లో ఈ రాష్ట్రానికే పెద్దదిక్కుగా ఉన్న ‘పెద్దాయన’ కోట్ల విజయభాస్కరరెడ్డి కుటుంబానికి వారసుడు అయిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీతో తరతరాల తమ కుటుంబం అనుబంధాన్ని వదలుకోనున్నారా? కాంగ్రెస్‌ పార్టీని వీడి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి డిసైడ్‌ అయ్యారా? అసలే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా శవాసనం వేసి ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. ఒకప్పట్లో ఆ పార్టీకి ఎంతో బలమైన జిల్లాగా ఉన్న కర్నూలులో ఇక పూర్తి పతనానికి చేరువలో ఉన్నదా? తాజా పరిణామాలను తరచి చూస్తున్నప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానమే కనిపిస్తోంది. రాహుల్‌సభలో వేదికమీదకు ‘సాక్షాత్తూ కేంద్ర మాజీ మంత్రి’ అయిన తనను అనుమతించకపోవడాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి.. ఆ అలకను ఇప్పటిదాకా వీడకుండా మరిన్ని ఊహాగానాలకు ఆస్కారం కల్పిస్తున్నారు.

నిజానికి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెలుగుదేశంలో చేరబోతున్నారని, తెదేపానుంచి వారికి ఆఫరు కూడా భారీగానే దక్కిందని సుమారు ఏడాదికి పైగా ప్రచారం జరుగుతోంది. కోట్ల కుమారుడు వెళ్లి నారా లోకేశ్‌తో భేటీ అయ్యాడని.. 2019 ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వారసుడికే కర్నూలు ఎంపీ టిక్కెట్‌ ఇవ్వడానికి అంగీకరించారని, అందుకు కేఈ కుటుంబాన్ని కూడా ఒప్పించారని.. తద్వారా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని బలమైన శక్తిగా రూపుదిద్దడానికి ప్రణాళిక సిద్ధమైందని ప్రచారం జరుగుతూ వచ్చింది.

అయితే క్రమంగా ఆ ప్రచారం చప్పబడిపోయింది. తాజాగా రాహుల్‌గాంధీ కార్యక్రమానికి వెళ్లిన వారిలో సూర్యప్రకాశ్‌రెడ్డిని వేదిక మీదికి అనుమతించకపోవడం.. దానిపై ఆయన సహజంగానే తీవ్రస్థాయిలో అలిగి.. దీనిపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేయడం జరిగింది. అయితే రఘువీరారెడ్డి వైపునుంచి అలాంటి స్పందన మాత్రం లేదు. భవిష్య కార్యాచరణ నిర్ణయించుకోవడానికి తన అనుచరులు, కార్యకర్తలతో కోట్ల సమావేశం పెట్టుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఏ నాయకుడు అయినా సరే.. ‘కార్యకర్తల్తో సమావేశం’ అంటే పార్టీ మారుత్నుట్లే లెక్క. అయితే ఆ సమావేశం ఇంకా జరగలేదు. కాకపోతే.. ఆయన అనుచరులంతా ఇప్పుడు పెద్దస్థాయిలో.. కాంగ్రెస్‌ నాయకత్వాన్ని తూర్పారపడుతున్నారు. తమను పట్టించుకోని పార్టీలో తమ నాయకుడు ఎందుకు ఉండాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

కోట్ల సూర్యప్రకాశరెడ్డి మీడియాతో తనకు పార్టీ మారే ఉద్దేశమే లేదని ప్రస్తుతానికి చెబుతున్నప్పటికీ.. మరి కొన్ని రోజుల్లో ఆయన ఖచ్చితంగా తెదేపా తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జిల్లాలో ముమ్మరంగా జరుగుతోంది. మొత్తానికి రాజకీయాల్లోనే ‘నేతల మాటలకు అర్థాలే వేరులే’ అనే సిద్ధాంతం ఇప్పుడు కోట్లకు కూడా వర్తిస్తుందని అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close