టీటీడీ బోర్డులోకి రామేశ్వర్‌రావు..!

తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులుగా… మైహోమ్ గ్రూప్ సంస్థల యజమాని, ప్రముఖ మీడియా సంస్థల అధిపతి అయిన.. జూపల్లి రామేశ్వరరావు పేరు దాదాపుగా ఖరారయినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే.. టీటీడీ బోర్డు చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కానీ.. బోర్డు సభ్యులను మాత్రం నియమించలేదు. పది రోజుల్లో నియమిస్తామని.. అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఈ కసరత్తు జరుగుతోంది.

సాధారణంగా.. టీటీడీ బోర్డులో… పొరుగు రాష్ట్రాల నుంచి… ఒక్కో ప్రతినిధిని తీసుకుంటూ ఉంటారు. తిరుమలకు అత్యధికంగా భక్తులు వచ్చే రాష్ట్రాలు… తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచే కాకుండా.. మహారాష్ట్రతో పాటు.. ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై వచ్చే ఒత్తిడి ప్రకారం.. ఇతర రాష్ట్రాల వారికీ అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి మాత్రం కచ్చితంగా ఒకరికి అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం తెలంగాణ నుంచి… అప్పట్లో టీడీపీలో ఉన్న సండ్ర వెంకటవీరయ్యకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం… ఏపీ సర్కార్‌.. తెలంగాణ నుంచి ఎవర్ని నియమించాలన్నదానిపై.. సొంత నిర్ణయం తీసుకోవడం లేదు. టీఆర్ఎస్‌కు ఆ చాయిస్ ఇచ్చింది. ఆ ప్రకారం… జూపల్లి రామేశ్వరరావు పేరును ప్రతిపాదించిటన్లుగా తెలుస్తోంది.

జూపల్లి రామేశ్వరరావు ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాదు… ఆయన ఆధ్యాత్మిక వేత్త కూడా. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆయన ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఆయనకు దైవభక్తి మెండు. ఆయన నుదుట ఎప్పుడూ …బొట్టు ఉంటుంది. ఆయన ఆసక్తి మేరకు.. ఆయనకు.. టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇవ్వాలని కేసీఆర్ సిఫార్సు చేసినట్లు.. దానికి ఏపీ సర్కార్ అంగీకరించిటన్లుగా తెలుస్తోంది. అందరి సభ్యులతో పాటు ఆయన పేరునూ ప్రకటించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close