కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం పై జగన్, సాక్షి గప్ చుప్, లోకేష్ సెటైర్స్

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అన్యాయం చేసినప్పటికీ ముఖ్యమంత్రి జగన్ మౌనం పాటిస్తున్నారు. గత ఐదేళ్లలో ఇలా జరిగినప్పుడల్లా, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ తాటికాయంత అక్షరాలతో రాసే సాక్షి సైతం, ఈ రోజు తన బ్యానర్ స్టొరీ లో బడ్జెట్ మీద పాజిటివ్ టోన్ లో హెడ్డింగ్ పెట్టింది. గతంలో కేంద్రం మెడలు వంచుతాం, ప్రత్యేక హోదా సాధిస్తాం అంటూ బీరాలు పలికిన జగన్, ఇప్పుడు ఎందుకు బిజెపికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ బడ్జెట్లో కేంద్రం మన రాష్ట్రానికి అన్యాయం చేసినా మిన్నకుండి పోయారు అంటూ లోకేష్ జగన్ మీద, సాక్షి మీద సెటైర్లు వేశారు.

లోకేష్ ట్వీట్ చేస్తూ, “మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేదు. ఏది మీ పోరాటం? ఏది మీ మడమ తిప్పని నైజం? కాళ్ళకు సాష్టాంగ పడటం, భజన చేయడమే పోరాటం అనుకుంటున్నారా? ఏపీ ప్రయోజనాలను సాధించడానికి మీరేం చేయదలచుకున్నారో చెప్పండి. ఇది ప్రజల తరపున మా డిమాండ్.గతంలో కేంద్రం ఇలాగే ఏపీకి మొండిచెయ్యి చూపిస్తే, నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబుగారు రాజీనామా చేయాలని మీరు డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరు ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు? కేసుల భయంతో మీరు కేంద్రానికి దాసోహం అనొచ్చు. కానీ అందుకోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే హక్కు మీకెక్కడిది?. . జగన్ గారూ! ఇన్నాళ్ళూ విశ్వనీయత అని మీరు అంటుంటే ప్రజల గురించి అనుకున్నాం. కానీ ఈ రోజు మీ విశ్వసనీయత మోడీ గురించి అని తెలిసింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగితే, మీ అక్రమ పత్రిక సాక్షిలో కేంద్రానికి భజన చేస్తూ ఇలాంటి రాతలు రాసుకున్న మీ గులాంగిరికి సలాం” అని రాసుకొచ్చారు.

లోకేష్ విమర్శల సంగతి పక్కన పెడితే, జగన్ కూడా కేంద్ర బడ్జెట్ పై స్పందించాల్సి ఉంది. గతంలో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడల్లా కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి అసమర్థత వల్లే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది అంటూ పలుమార్లు వ్యాఖ్యానించిన జగన్, ఇప్పుడు కేంద్ర బడ్జెట్ పై ఎలా స్పందిస్తాడో చూడాలన్న కుతూహలం ప్రజలలో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close