చర్చలకు సిద్ధమన్న ముద్రగడ: 50% పైన రిజర్వేషన్ ఇవ్వొచ్చన్న మంజునాథ్

హైదరాబాద్: కాపులకు రిజర్వేషన్ ఇస్తే ఇప్పుడున్న 50శాతం రిజర్వేషన్ పరిమితి దాటాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే సుప్రీమ్ కోర్ట్‌ను ఒప్పించి 50 శాతానికి పైన రిజర్వేషన్ పొందొచ్చని కాపులకు రిజర్వేషన్ కల్పించటంపై ఏర్పాటు చేసిన కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ్ చెప్పారు. ఆయన ఇవాళ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 50 శాతం మించి రిజర్వేషన్‌లు ఇవ్వగూడదని సుప్రీమ్ కోర్ట్ చెప్పలేదని అన్నారు. తనను నియమించింది కాపు కమిషన్ ఛైర్మన్‌గా కాదని, బీసీ కమిషన్ ఛైర్మన్‌గానని తెలిపారు. ఇంకా సభ్యుల నియామకం జరగాల్సి ఉందని చెప్పారు. 13 జిల్లాల్లో పర్యటిస్తానని, కాపుల గణాంకాలు సేకరించి వీలైనంత త్వరలో నివేదిక ఇస్తామని అన్నారు. మిగిలిన బీసీల అభ్యంతరాలను, కాపుల సామాజిక ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేస్తామని చెప్పారు.

మరోవైపు ముద్రగడ ఇవాళ కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడుతూ, కమిషన్ కాలపరిమితిని కుదించాలని డిమాండ్ చేశారు. కాపులకు ఇస్తామన్న రెండువేల కోట్లను రిలీజ్ చేయాలని అన్నారు. ప్రభుత్వ ప్రతినిధులు వస్తే మాట్లాడతానని చెప్పారు. ఇంతవరకు ఎవరూ రాలేదని తెలిపారు. తాను, తన శ్రీమతి రేపు ఉదయం 9 గంటలకు నిరాహారదీక్షలో కూర్చుంటామని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు సాధించటమే తన జీవిత లక్ష్యమని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close