ప్రపంచబ్యాంక్‌కు చాన్సివ్వకూడదనే రుణం వద్దన్న కేంద్రం..!

అమరావతికి ఇక రుణం మంజూరేనని.. అనుకుంటున్న సమయంలో.. ప్రపంచబ్యాంక్ షాకిచ్చింది. రుణ ప్రతిపాదనల నుంచి ఒక్క సారిగా డ్రాప్ అయిపోయింది. అసలు దీని వెనుక ఏం జరిగిందన్నదానిపై.. మాత్రం.. రకరకాల చర్చలు జరుగాయి. జగన్ పై నమ్మకం లేకనే.. ప్రపంచబ్యాంక్ రుణం ఇవ్వలేదంటూ.. టీడీపీ నతేలు ప్రచారం చేశారు. ఈ ప్రచారం ఉద్ధృతంగా సాగడంతో.. వరల్డ్ బ్యాంకే వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం రుణప్రతిపాదన విరమించుకోవడం వల్లే.. తాము వెనక్కి తగ్గామని ప్రకటించింది.

కేంద్రం అమరావతికి రుణం వద్దని చెప్పిన మాట నిజమే..!

ఏపీలో చంద్రబాబు సర్కార్ ఓడిపోగానే… ప్రపంచబ్యాంక్ నుంచి ఓ లేఖ వచ్చింది. అమరావతి రుణ ప్రతిపాదన చివరి పరిశీలనలో ఉందని..అయితే.. గతంలో వచ్చిన అభ్యంతరాల మేరకు.. ఓ సారి పూర్తి స్థాయి పరిశీలన జరుపుతామని ఆ లేఖ సారాంశం. అయితే ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించలేదు. ప్రాజెక్టును మరో సారి ఇన్స్‌స్పెక్షన్ చేస్తామన్న ప్రపంచబ్యాంక్ బృందానికి అనుమతి ఇవ్వవొద్దని.. ప్రభుత్వం మారిన తర్వాత ఏపీ సర్కార్ ను కేంద్రం ఆదేశించింది. ఇది చెడు సంప్రదాయమని.. ఒక సారి చాన్సిస్తే.. ప్రపంచబ్యాంక్ తాము రుణం ఇచ్చే.. అన్ని ప్రాజెక్టులను పరిశీలిస్తామని చెబుతుందని.. కేంద్రం భావించింది. అమరావతికి ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకోవాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని… సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా.. ప్రపంచబ్యాంక్ రుణంపై ఆసక్తి చూపించలేదు.

ప్రపంచబ్యాంక్ బోర్డు భేటీ కంటే ముందే నిర్ణయం ఎందుకో..?

నిజానికి మంగళవారం ప్రపంచబ్యాంకు బోర్డు సమావేశం జరగనుంది. ఆ సమావేశంలోనే ప్రపంచవ్యాప్తంగా తమకు వచ్చిన రుణ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటారు. కానీ ప్రపంచబ్యాంక్ బోర్డు సమావేశంతో సంబంధం లేకుండా.. అమరావతి రుణ ప్రతిపాదనల నుంచి ప్రపంచబ్యాంక్ డ్రాప్ అయిపోయింది. సమావేశం వరకూ ఎందుకు ఆగలేకపోయారన్నది మరో కీలకమైన అంశం. అసలు కేంద్ర ప్రభుత్వమే డ్రాప్ అయిపోయిన తర్వాత.. మళ్లీ కొత్తగా బోర్డులో చర్చించేదేముందని.. ప్రపంచబ్యాంక్ భావించినట్లు తెలుస్తోంది.

మరి అమరావతికి కేంద్రం నిధులు సమకూరుస్తుందా..?

ప్రపంచబ్యాంక్ ఆర్థిక సాయంతో.. జరిగే ఇతర పనులకు ఆటంకం రాకుండా.. ఇబ్బంది కలగకుండా.. అమరావతికి రావాల్సిన రుణాన్ని కేంద్రం నిలిపి వేసింది. మరి ప్రత్యామ్నాయ వనరుల సమీకరణకు ప్రయత్నిస్తుందా.. అనేది ఆసక్తికరం. అవసరమైతే నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాల్ని చూద్దామని సలహా ఇచ్చిందని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ విషయంలో కేంద్రం ఎంత మేర సహకరిస్తుందో.. ముందు ముందు తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close