బాక్సాఫీస్ “రణరంగం”లో గెలిచేది “ఎవరు”?

ఈ ఇండిపెండెన్స్ డే కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ముందుకి రెండు సినిమాలు రాబోతున్నాయి. రణరంగం. ఎవరు?. రెండు కూడా భిన్నమైన సినిమాలే రణరంగం యాక్షన్ థ్రిల్లర్ అయితే ఎవరు? సస్పెన్స్ థ్రిల్లర్.

శర్వానంద్ నటించిన రణరంగం ఫస్ట్ లుక్ తోనే పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకురాగలిగింది. తర్వాత వచ్చిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. లవ్ స్టోరీస్ లో కనిపించే శర్వానంద్ ఒక్కసారిగా యాక్షన్ లోకి రావడం ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ కూడా జనాల్లో ఆసక్తి పెంచింది. 80వ దశకం, ప్రస్తుతం ..ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఓ మాఫియా కథని సుధీర్ వర్మ చూపించబోతున్నాడని, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

ఇప్పుడు శర్వానంద్ కూడా ఒక మంచి హిట్ కావాలి. పడి పడి లేచే మనసు సినిమాకి మంచి అప్లాజ్ వచ్చినా సాలిడ్ హిట్ మాత్రం అందలేదు. లిమిటెడ్ ఆడియన్స్ కి పరిమితమైపోయిందా సినిమా. ఇప్పుడు రణరంగం తో కచ్చితంగా ఓహో హిట్టు కొట్టాలని భావిస్తున్నాడు శర్వానంద్.

అడవి శేషు నటించిన ఎవరు? సినిమా పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హిట్స్ లో ఉన్నాడు అడవి శేషు. క్షణం, గూడచారి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో థ్రిల్లర్ హీరో అనిపించుకున్నాడు. ఎవరు? కూడా థ్రిల్లర్ సినిమానే. ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. హిట్ లక్షణాలు కనిపిస్తున్నాయి.
ప్రమోషన్స్ కూడా విభిన్నంగా చేస్తున్నారు. సినిమా చూడాలనే ఆసక్తి జనాల్లో వుంది.

టోటల్ గా మంచి అంచనాల మధ్య ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో బాక్స్ ఆఫీస్ విజేత గా నిలిచేదెవరో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కుదరదన్న తెలంగాణ హైకోర్టు

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి గుడ్ న్యూస్ లు వరుసగా వినిపిస్తున్నాయి. అప్రూవర్ గా మారిన దస్తగిరి తనను జైల్లో పెట్టి.. పెద్ద ఎత్తున ప్రలోభపెట్టడమే కాకుండా......

‘ఆ ఒక్కటీ అడక్కు’ రివ్యూ: క్లాసిక్ టైటిల్ చెడ‌గొట్టారు

Aa Okkati Adakku Movie review తెలుగు360 రేటింగ్ 2.25/5 -అన్వ‌ర్‌ ఒకప్పుడు అల్లరి నరేష్ నుంచి కామెడీ సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ వుండేది. తర్వాత పరిస్థితి మారింది. ఆయనపై కామెడీ కథలు సరిగ్గా...

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close