దొనకొండా… ! అదెక్కడుంది..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…రాజధానిపై స్పెక్యులేషన్‌ను పెంచేందుకు ఒకలా.. తగ్గించేందుకు మరోలా.. వ్యాఖ్యలు చేస్తూ… గందరగోళానికి గురి చేస్తోంది. అమరావతి విషయంలో ప్రభుత్వం చర్చ జరుగుతోందని.. నిర్మోహమాటంగా ప్రకటించిన బొత్స సత్యనారాయణ .. ఆ తర్వాత చేసిన వివాదాస్పద ప్రకటనలకు అంతే లేదు. తాజాగా.. వైసీపీ చాయిస్‌గా ప్రచారంలో ఉన్న దొనకొండపై… మంత్రి బొత్స సత్యనారాయణ.. అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. రాజధానిని దొనకొండకు మారుస్తారా.. అంటూ.. మీడియా నుంచి ఎదురైన ప్రశ్నలకు.. ఆయన ” దొనకొండా.. అదెక్కడుంది..?” అంటూ.. వెటకారపు సమాధానం చెప్పారు. దీంతో ఆశ్చర్యపోవడం మీడియా ప్రతినిధుల వంతు అయింది.

అమరావతిపై.. లేనిపోని అనుమానాల్ని రేకెత్తించింది.. చివరికి గెజిట్ ప్రకటించలేదు కాబట్టి.. తాత్కాలిక రాజధానినే అనేసిన.. బొత్స సత్యనారాయణ… అమరావతి విషయంలో తన వాదనను సమర్థించుకోవడానికి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికీ.. కచ్చితంగా అమరావతిలోనే రాజధాని ఉంటుందని.. నేరుగా ఒక్క మాట కూడా.. ప్రభుత్వం నుంచి స్పష్టంగా రాలేదు. కానీ… అమరావతి ఎక్కడికి పోతుంది..?. రాజధాని మారుస్తారమని ఎవరు చెప్పారు..? ముఖ్యమంత్రి ఏమీ చెప్పకుండానే ఎందుకు ప్రచారం చేస్తారు..? అంటూ… విభిన్నమైన ప్రశ్నలతో ఎదురుదాడి చేస్తున్నారు కానీ… అందరూ డిమాండ్ చేస్తున్నట్లుగా.. సీఎం .. అమరావతిలోనే రాజధాని ఉంటుందని.. జగన్ ఎందుకు ప్రకటించడం లేదనేదే చాలా మందికి అర్థం కాని విషయం.

బొత్స సత్యనారాయణ.. దొనకొండకు రాజధాని తరలింపుపై సెటైర్లు వేసినా… దొనకొండను కించ పరిచేలా మాట్లాడినా.. వైసీపీ ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుతో.. స్పెక్యులేషన్ తగ్గే అవకాశం లేదు. వైసీపీ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున అమరావతిలో భూములు కొనుగోలు చేస్తున్నారని.. అక్కడ భూముల రేట్లు ‌అమాంతం పెరిగిపోయాయని… చెబుతున్నారు. ఈ క్రమంలో బొత్స… అసలు దొనకొడ ఎక్కడో కూడా తెలియదన్నట్లుగా వ్యవహరించడం… మాట్లాడటం… చర్చనీయాంశం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close