ఏపీ సెక్రటేరియట్ టాక్ : ఐఏఎస్‌లు డమ్మీలు.. అసలు షో వాళ్లదే..!

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఎప్పుడైనా… ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐఏఎస్ అధికారులే… పాలన సాగిస్తూ ఉంటారు. సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇలా.. వివిధ హోదాల్లో వీరి పని విభజన ఉంటుంది. ఇప్పుడు కూడా.. వీరందరూ ఉన్నారు. కానీ వీరెవరూ పని చేయడం లేదు… చేయనివ్వడం లేదు. వీరి పని అంతా.. ఇతరులు చేస్తున్నారు. వారే… సలహాదారులు. ఐఏఎస్‌లకు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా… ప్రభుత్వ పెద్దలతో తమకు ఉన్న సాన్నిహిత్యంతో బెదిరింపు ధోరణితో.. ఇప్పుడు… అన్ని విభాగాలను వారు క్యాప్చర్ చేసేశారనే ప్రచారం జరుగుతోంది.

ప్రతీ బ్లాక్‌లోనూ “ప్రభుత్వ నియామక పవర్ ఫుల్” వ్యక్తి..!

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌లో దాదాపుగా ఉన్న ప్రతీ విభాగంలోనూ.. ఓ పవర్ ఫుల్ వ్యక్తి కొత్తగా వచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల కన్నా… మిన్నగా… ప్రభుత్వం ద్వారా ఔట్ సోర్సింగ్ ద్వారానో… డిప్యూటేషన్ ద్వారానో వచ్చిన వారే ఇందులో అధికం. నిర్ణయాలు వారే తీసుకుంటున్నారు. సంతకాలు మాత్రం.. సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు పెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇది.. సెక్రటేరియట్‌లో అసంతృప్తికి కారణం అవుతోంది. పని వాతావరణం దెబ్బతింటోందని.. సెక్రటేరియట్ ఉద్యోగులు.. బహిరంగంగానే వ్యాఖ్యానించడం ప్రారంభించారు. పెద్దగా పని ఉండని.. శాఖల్లోనూ… ఇలాంటి పరిస్థితి ఉండటం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఎప్పుడూ లేనంత భిన్నమైన వాతావరణం ఇప్పుడు సెక్రటేరియట్‌లో ఉంది.

వీళ్లకి జీత భత్యాలు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌ల కన్నా ఎక్కువే..!

సలహాదారులు… ఇతర నియామకాలు ప్రభుత్వ పెద్ద వద్ద నుండి పొందిన వారికి జీతభత్యాలు.. ప్రారంభమే రూ. మూడు లక్షల నుంచి ఉంటున్నాయి. అది కేవలం జీతమే వారికి ఎనిమిది మంది సిబ్బంది, ఇతర అవసరాలు.. అన్నీ కలిపి… ఏడాది… రూ. కోటి చేరుకుంటుందన్న ప్రచారమూ ఉంది. సీనియర్ ఐఏఎస్‌లకు అంత జీతాలు లేవు. అంతే కాదు.. ఇప్పుడు.. అధికారాలు కూడా లేవు. ఐఏఎస్‌ల మాట వినడానికి.. ఉద్యోగులు కూడా వణికిపోయే పరిస్థితి వచ్చింది. తమ మాటే వినాలన్న శాసనాన్ని సలహాదారులు అమలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రోజు రోజుకు… ఇలా నియమించేవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దాంతో పరిస్థితి రాను రాను మరింత దిగజారుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

సాక్షి హెడ్ క్వార్టర్ గా మారిన సచివాలయం…!

ఏపీ సెక్రటేరియట్‌కి ఇప్పుడు ఏ మూలకి వెళ్లినా సాక్షి ఉద్యోగి కనిపిస్తున్నారు. ఉన్నత స్థాయిలో… బ్యూరో చీఫ్ గా పని చేసిన వారి దగ్గర్నుంచి చివరికి ఆఫీస్ బాయ్ కూడా.. సాక్షి నుంచే… సెక్రటేరియట్‌లోకి దిగుమతి అయ్యారు. సజ్జల రామక్రిష్ణారెడ్డి, జీవీడి క్రిష్ణమోహన్, శ్రీహరి, నగేష్, చింతకింది శ్రీనివాసరావు, రాజారమేష్, ఈశ్వర్ లాంటి జర్నలిస్టులు ఇప్పటికే హల్ చల్ చేస్తున్నారు. 25 మంది మంత్రులకు 25 మంది సాక్షి ఉద్యోగులుగా నియమించారు. ఫోటో గ్రాఫర్లూ సాక్షి నుంచే. చివరికి ఆఫీసు బోయ్ లు కూడా సాక్షి నుంచే తీసుకుని అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్నారు. దీంతో.. ఎక్కడ చూసినా… సాక్షి ఉద్యోగులే కనిపిస్తున్నారు. ఓ వైపు.. బయట వ్యక్తుల హడావుడి.. మరో వైపు సాక్షి ఉద్యోగుల హల్ చల్… ప్రభుత్వ ఉద్యోగుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close