జేసీ బ్రదర్స్ ఆర్థిక మూలాలపై దెబ్బ..!

అనంతపురం జిల్లాలో తిరుగులేని నేతలుగా గుర్తింపు తెచ్చుకున్న జేసీ బ్రదర్స్ కు గడ్డు కాలం వచ్చింది. జగన్మహోన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజకీయంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు ఆర్థికంగా కూడా ఇబ్బందులెదురయ్యే పరిస్థితి వచ్చింది. జేసీ బ్రదర్స్ చాలా ఏళ్ల నుంచి ట్రావెల్స్ వ్యాపారంలో ఉన్నారు. వంద బస్సులకుపైగానే ఇంటర్ స్టేట్ ట్రావెల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు.. ఆ బస్సుల్లో 31 బస్సులను ఏపీ రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. దానికి వారు చాలా కారణాలు చెప్పారు. అధికంగా ప్రయాణికులను ఎక్కించుకోవడం… అధిక ధరలు వసూలు చేయడం… స్టేజ్ కేరియర్లుగా తిప్పడం వంటివి. అయితే.. ప్రతీ ట్రావెల్స్ బస్సుపైనా ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఇతర ట్రావెల్స్ బస్సుల్ని నామమాత్రంగా సీజ్ చేసిన రవాణా అధికారులు… జేసీ బ్రదర్స్‌కు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సుల్ని సీజ్ చేయడమే కాదు.. పర్మిట్లను కూడా రద్దు చేశారు.

ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా.. జేసీ బ్రదర్స్… తెలుగుదేశం పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నారు. రాజకీయ కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొనడంలేదు. టీడీపీ జెండా కింద కాకుండా.. సొంతంగానే… జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు. అప్పుడప్పుడు వైసీపీకి కాస్త సపోర్ట్ గా నే ప్రకటనలు చేస్తున్నారు. తరచూగా.., బీజేపీలోకి వెళ్లబోతున్నారన్న ప్రచారాన్ని కూడా… వార్తల్లోకి వచ్చేలా చేస్తున్నారు. కొంత మంది బీజేపీ పెద్దలతోనూ జేసీ దివాకర్ రెడ్డి సమావేశమైనట్లుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం మాత్రం.. వెనక్కి తగ్గడం లేదు.

ఇప్పటికే తాడిపత్రిలో… జేసీ ముఖ్య అనుచరులు పలువురిపై కేసులు పెట్టారు. ప్రబోధానంద ఆశ్రమంపై దాడి ఘటనలో… పలువురు జేసీ అనుచరులను తాజాగా అరెస్టులు చేయడం ప్రారంభించారు. దీంతో జేసీ బ్రదర్స్‌కు ఉక్కపోత ప్రారంభమయింది. ఓ వైపు అనుచరులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. మరో వైపు వ్యాపారాలుపై… ప్రభుత్వం గురి పెట్టింది. వీటిపై జేసీ సోదరులు ఎలా వ్యవహరించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close