ఎట్టకేలకు అమిత్‌షాతో జగన్ భేటీ..!

సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రహోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. నిన్నంతా.. ఢిల్లీలోనే ఉన్నప్పటికీ.. అమిత్ షా కార్యాలయం నుంచి జగన్‌కు ఫోన్‌ రాలేదు. ఈ రోజు ఉదయమే.. అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో.. జగన్ అమిత్ షా నివాసానికి వెళ్లారు. దాదాపు నలభై నిమిషాల పాటు.. అమిత్ షాతో.. వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి.. విభజన చట్టంలో అమలు చేయాల్సిన అంశాలపై చర్చించారు. తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితోనూ.. జగన్ సమావేశమవుతారు.

పది రోజుల కిందట.. జగన్మోహన్ రెడ్డి నరేంద్రమోడీతో పర్యటన కోసం ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలో… మోడీ కంటే ముందుగానే… అమిత్ షాతో అపాయింట్‌మెంట్ ఖరారయింది. కానీ.. చివరి క్షణంలో రద్దవడంతో.. మోడీతో సమావేశమై… నేరుగా అమరావతి వచ్చేశారు. ఆ తర్వాత నాలుగైదు రోజులకే.. మరోసారి అమిత్ షా కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్ ఖరారైనట్లుగా సమాచారం వచ్చింది. ఢిల్లీ బయలుదేరే సమయానికి.. అది కూడా క్యాన్సిల్ అయింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారంలో అమిత్ షా బిజీగా ఉండటంతో క్యాన్సిల్ అయిందని చెప్పుకున్నారు. ఎన్నికల హడావుడి ముగియడంతో.. అమిత్ షాకు తీరుబడి ఉంటుందన్న ఉద్దేశంతో జగన్ ఢిల్లీ వెళ్లారు. సోమవారం.. వివిధ కారణాలతో కలవలేకపోయినా.. మంగళవారం ఉదయాన్నే.. భేటీ అయ్యారు.

రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో… వాటిపై.. అమిత్ షాతో మాట్లాడాలని మోడీ సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే.. అమిత్ షాతో భేటీ కోసం జగన్ తీవ్రంగా ప్రయత్నించారని చెబుతున్నారు. విభజన చట్టం గురించిన అంశాలు ప్రధానంగా.. కేంద్రహోంమంత్రి చేతుల్లోనే ఉంటాయి. అంతే కాకుండా.. ఏపీకి రావాల్సిన నిధులు.. ఇతర అవసరాలు ఏమైనా.. మొదటి నుంచి అమిత్ షా చూస్తూంటారు. గత ప్రభుత్వంలో .. మంత్రిగా లేకపోయినప్పటికీ.. అమిత్ షా.. ఏపీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పుడు కూడా.. అమిత్ షా సూచనలు ఇస్తేనే.. ఏపీకి నిధులు, ప్రాజెక్టులు విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకే.. జగన్.. అమిత్ షాను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close