ఏపీ ఉన్నతాధికారుల డిష్యూం..డిష్యూం..!

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నతాధికారులు ఆధిపత్య పోరాటంలో… ఒకరిపై ఒకరు చర్యలు తీసుకోవడానికి తమ అధికారాలన్నింటినీ ఉపయోగించుకుంటున్నారు. కొద్ది రోజులుగా.. సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఉన్న అధికారాలన్నింటినీ… ఇటీవలే… జగన్‌కు పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులైన ప్రవీణ్ ప్రకాష్..తనకు తానే ధారదత్తం చేసుకున్నారు. ఈ మేరకు బిజినెస్ రూల్స్ మార్చుతూ.. సంచలనత్మాక ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విషయంపై.. ఎల్వీ సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి వద్ద పంచాయతీ పెట్టినా ప్రయోజనం లేకపోయింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి.. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని.. ఇక తన వద్దకు రావొద్దని.. ఏమైనా ఉంటే… ముఖ్య సలహాదారు కల్లం అజేయరెడ్డి వద్ద మాట్లాడుకోమని ముఖం మీదనే చెప్పేశారన్న ప్రచారం.. సెక్రటేరియట్‌లో జరుగుతోంది. ఈ వ్యవహారం ఇలా ఉండగనే.. కేబినెట్ సమావేశం… ఎల్వీని మరింతగా.. అవమానించేలా జరిగింది.

గత బుధవారం జరిగిన కేబినెట్‌ భేటీలో… ఎజెండాలో లేని అంశాలున్నాయి. ఆ అంశాలను.. విధివిధానాలు పాటించకుండా కేబినెట్‌ అజెండాలో అంశాలు చేర్చారని.. సీఎస్‌కు కేబినెట్ భేటీ ప్రారంభమైన తర్వాతే తెలిసింది. దీన్నే అవకాశంగా తీసుకుని జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌కు సీఎస్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరణ కోరారు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో కేబినెట్‌ అజెండాలో అంశాలను ప్రవీణ్‌ ప్రకాష్‌ చేర్చారు. నిజానికి కేబినెట్ భేటీలో ఏయే అంశాలు రావాలన్నది.. సీఎస్ .. అన్ని శాఖల నుంచి వివరాలు తీసుకుని ఎజెండా ఖరారు చేస్తారు. కానీ.. ప్రవీణ్ ప్రకాష్.. అసలు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉనికి గుర్తించడానికి కూడా సిద్ధపడటం లేదు కాబట్టి.. ఆయనే.. కీలకమైన అంశాలు రెడీ చేస్తున్నారు. దీంతో.. ఆధిపత్య పోరాటం ప్రారంభమయింది.

ఐదు నెలల కాలంలో.. అధికారులు ఎవరూ.. తమ తమ బాధ్యతల్లో కుదురుకోలేకపోయారు. అనేక సార్లు… బదిలీలు జరిగాయి. సీఎంవో అధికారుల ఇష్టారాజ్యం అయిపోయింది. సీఎంతో సాన్నిహిత్యం ఉన్న ప్రతి ఒక్కరూ తాము సీఎస్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం సెక్రటేరియట్‌లో జరుగుతోంది. ప్రవీణ్ ప్రకాష్ సీఎంవోలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత సీరియస్‌గా మారింది. కొద్ది రోజుల కిందటి వరకూ.. ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ ప్రకాష్ ఉండేవారు. తిరుమల ఆలయానికి సంబంధించి లోకల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గా ఆయన ఉంటారు. టీటీడీ నిధుల విషయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ.. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి… ఓ చిన్న స్థాయి అధికారితో విచారణ జరిపించారు. దీనిపై ప్రవీణ్ ప్రకాష్.. ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో.. కానీ.. నేరుగా ఆయనను.. సీఎంవోలోనే తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన… వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close