వైకాపా మెడకు వంశీ నిర్వాకం..!

వల్లభనేని వంశీ పార్టీ మార్పు వివాదంలోకి.. అయ్యప్పస్వామి మాల నీతి, నియమాలు చొచ్చుకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి అయ్యప్ప మాలలో ఉన్న వంశీతో.. అసభ్యంగా మాట్లాడిస్తూ.. హిందూధర్మంపై అందరికీ చిన్నచూపు పడేలా చేస్తున్నారని.. టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అదే సమయంలో… మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా అయ్యప్ప దీక్షాధారణలో ఉన్నారు. అయితే.. ఆయన ఎక్కడ చూసినా.. చెప్పులతోనే కనిపిస్తున్నారు. ఈ ఫోటోలో సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. ఈ కారణంగా అటు వల్లభనేని వంశీ మాటలను.. ఇటు అవంతి శ్రీనివాస్ చెప్పుల విహారాన్ని వివరిస్తూ.. అంతా జగన్ వల్లేనని మండి పడుతున్నారు. 

వల్లభనేని వంశీ.. చంద్రబాబు దీక్ష చేసిన రోజున ప్రెస్ మీట్ పెట్టి కాస్త పద్దతిగానే మాట్లాడారు. అయితే.. ఆ వివాదాన్ని మరింత చర్చనీయాంశం చేయాలన్న సూచనలు వచ్చాయేమో కానీ.. టీవీచానల్ చర్చల్లో కూర్చుని.. బండ బూతులు తిట్టడం ప్రారంభించారు. తనను ప్రశ్నించిన వారిపై.. విరుచుకుపడ్డారు. ఆయన మాటలు.. రెండో రోజు కూడా కొనసాగాయి. రెండో రోజు.. చంద్రబాబు, లోకేష్‌లపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ మాటలు సభ్యతను దాటి.. సంస్కార హీనంగా ఉన్నాయని.. అదీ కూడా.. నిన్నామొన్నటిదాకా ఆ పార్టీలో ఉంటూ… బయటకు వచ్చి ఇలా మాట్లాడటం ఏమిటన్న చర్చ సహజంగానే ప్రారంభమయింది. ఆయన మాలలో ఉండటంతో టీడీపీ నేతలు.. నియమాల విషయాన్ని తెరపైకి తెచ్చారు. 

వంశీ మాట తీరు అది కాదని.. ఆయనతో జగన్ మాట్లాడిస్తున్నారని టీడీపీ నేతలు మండి పడుతున్నారు. అయ్యప్ప మాలలో ఉన్నవారితో మాట్లాడిస్తూ… జగన్‌ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ నేరుగానే మండిపడ్డారు. నిష్ఠతో ఉండాల్సిన అయ్యప్పస్వాముల పవిత్రతను జగన్‌ దెబ్బతీస్తున్నారన్నారు. ఒక్క టీడీపీ నేతల నుంచే.. కాదు… అయ్యప్ప దీక్షను పవిత్రంగా చూసే భక్తుల్లోనూ.. వంశీ , అవంతి శ్రీనివాస్‌ల తీరుపై అసహనం కనిపిస్తోంది. వారు.. ఇంకెంత మాత్రం అయ్యప్పదీక్షను కొనసాగించడానికి  అర్హులు కాదని.. తక్షణం  శుద్ధి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close