గంటా బీజేపీకి దగ్గరైన కారణం అదన్నమాట..!

ఇటీవలి కాలంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మల్యే గంటా శ్రీనివాసరావు… భారతీయ జనతాపార్టీ నేతలతోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. టీడీపీలోని తన పాత మిత్రులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లతో ఎక్కువగా టచ్‌లో ఉంటూ..ఢిల్లీలో తరచూ కనిపిస్తున్నారు. అమిత్ షా, మోడీ అపాయింట్‌మెంట్ల కోసం ప్రయత్నించి.. కలుస్తున్నారు. వైసీపీలో చేరేందుకు ఆఫర్ ఉండగా.. గంటా ఇలా బీజేపీ వైపు ఎందుకు చూస్తున్నారా.. అన్న దానికి.. మొత్తానికి క్లారిటీ వచ్చింది. ఆయనకు చెందిన ప్రత్యూష గ్రూప్‌ బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టింది. తనఖా పెట్టిన ఆస్తుల వేలానికి రంగం సిద్ధం చేశాయి ఆ బ్యాంకులు. వేలం ప్రతిపాదనలు చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉండంగా.. ఇప్పటికిప్పుడు వాటిలో కదలిక కనిపిస్తోంది.

గంటా శ్రీనివాసరావుకు ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ వివిధ బ్యాంకుల నుంచి.. దాదాపుగా రూ. 209 కోట్ల రుణం తీసుకుంది. ఇందులో.. చాలా వరకూ తిరిగి చెల్లించలేదు. అంత రుణానికి.. బ్యాంకుల వద్ద తనాఖా పెట్టిన ఆస్తుల విలువ రూ. 40 కోట్ల లోపే అని.. వేలం వేసే బ్యాంకులు చెబుతున్నాయి. రుణగ్రహితల జాబితాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ ఉన్నారు. బ్యాంక్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. మరి ఈ నోటీసులకు గంటా ఇంతవరకూ రియాక్ట్ కాలేదు. ఆస్తులను విశాఖలోని ఇండియన్ బ్యాంకు కొంత కాలం కిందటే స్వాధీనం చేసుకుంది. వాటిని వచ్చే నెల ఇరవైన వేలం వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

టీడీపీలో ఉన్నప్పుడు సుజనా చౌదరిపై.. కూడా బ్యాంకులకు పెద్ద ఎత్తున డబ్బులు ఎగవేసినట్లుగా ప్రచారం జరిగింది. సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఓ సందర్భంలో ఆయనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఆయన హైకోర్టుకు వెళ్లి ఎలాగోలా అరెస్ట్ కాకుండా… విచారణకు హాజరయ్యేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆయన బీజేపీలో చేరిన తర్వాత అంతా.. సైలెంటయిపోయింది. ఇప్పుడు గంటా కూడా… అలాంటి అడ్వాంటేజ్ కోసమే.. బీజేపీతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close