కీర్తి నో చెప్పింది: బాల‌య్య క‌ష్టాలు షురూ!

పెద్ద హీరోల‌తో సినిమా అంటే అంతా హ్యాపీనే అనుకోవాల్సిన ప‌నిలేదు. వాళ్ల‌కుండే క‌ష్టాలు వాళ్ల‌కుంటాయి. మ‌రీ ముఖ్యంగా హీరోయిన్ల‌ని వెదికిప‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టం అయిపోతోంది. స్టార్ హీరోల ఇమేజ్‌కి త‌గిన హీరోయిన్లు దొర‌క‌డం లేదు. కొద్ది మంది ఉన్నా – వాళ్లు ముందుకు రావ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా బాలయ్య సినిమా అంటే ఈ స‌మ‌స్య ఎదుర‌వుతూనే ఉంటుంది. అందుకే.. మ‌ధ్యేమార్గంగా దాదాపు కొత్త‌వాళ్ల‌నో, క్రేజ్ లేనివాళ్ల‌నో ఎంచుకుని స‌రిపెట్టుకుంటుంటాడు బాల‌య్య‌. రూల‌ర్‌లో న‌టిస్తున్న వేదిక‌, సోనాల్ చౌహాన్ అందుకు ఉదాహ‌ర‌ణ‌.

ఇప్పుడు బాల‌య్య సినిమా మ‌ళ్లీ హీరోయిన్ క‌ష్టాలు మొద‌టికి వ‌చ్చాయి. బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఇటీవ‌లే క్లాప్ కొట్టుకుంది. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఇందులో క‌థానాయిక‌గా కీర్తి సురేష్‌ని అనుకున్నారు. క‌థ కూడా వినిపించారు. కానీ కీర్తి సినిమాలో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని తెలుస్తోంది. కాల్షీట్ల స‌మ‌స్య‌వల్లో, మ‌రోటో తెలీదు గానీ కీర్తి ఈ సినిమా చేయ‌డానికి రెడీగా లేద‌ట‌. దాంతో మ‌రో ఆప్ష‌న్ కోసం వెదుకులాట మొద‌లైంది. దాదాపుగా అగ్ర క‌థానాయిక‌లంద‌రినీ సంప్ర‌దించేశారు. న‌య‌న‌తార ని మ‌రోసారి తీసుకొద్దాం అనే ఆలోచ‌న కూడా ఉంది. అయితే న‌య‌న అంటే దాదాపు 2.5 కోట్లు కావాలి. ఇప్ప‌టికే ఈ సినిమా బ‌డ్జెట్ 70 కోట్లు దాటేసింది. అదీ పేప‌ర్ పైన‌. చివ‌రికి ఎంత తేలుతుందో తెలీదు. ఇప్పుడు హీరోయిన్ కోసం మ‌ళ్లీ కొన్ని కోట్లు తీసుకురావాలంటే క‌ష్టం. సో.. న‌య‌న‌తార కంటే.. కాస్త బెట‌ర్ ఆప్ష‌న్ కోసం బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌య‌త్నిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close