రాజుగారి విందులో వైసీపీ సైడ్ రోలే..!

ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో ఎంపీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందు రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఆ విందు చాలా లావిష్‌గా ఉంటుందని.. ప్రధానమంత్రి, హోంమంత్రితో పాటు మూడు వందల మంది ఎంపీలు వస్తారంటూ.. రఘురామకృష్ణంరాజు వర్గీయులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. విందు, విశేషాల గురించి గొప్పగా చెప్పారు. అయితే.. చివరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ మాత్రమే ప్రధాన అతిధిగా హాజరయ్యారు. బీజేపీ తో పాటు.. పలు పార్టీలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. తృణమూల్, టీడీపీ ఎంపీలు కూడా హాజరయ్యారు.

అయితే.. రఘురామకృష్ణంరాజు.. ఇచ్చిన ఈ విందులో వైసీపీ పాత్ర ఎక్కడా కనిపించలేదు. వైసీపీ ఎంపీ హోదాలో…రఘురామకృష్ణంరాజు విందు ఇచ్చారు. అయినప్పటికీ..వైసీపీకి స్పెషల్ ట్రీట్‌మెంట్ లభించలేదు. ఈ విందు ఇవ్వడానికి తమ అనుమతి తీసుకోలేదన్న అసంతృప్తి వైసీపీ పెద్దల్లో ఉంది. విజయసాయిరెడ్డి ఈ విందుకు హాజరు కాలేదు. ఎవరూ హాజరు కాకపోతే… మరో రకమైన ప్రచారం జరుగుతుందన్న ఉద్దేశంతో.. కావొచ్చు.. మిధున్ రెడ్డి మాత్రం.. విందుకు హాజరయ్యారు. విందులో.. వైసీపీ ఎంపీల హడావుడి కూడా కనిపించలేదు.

నిజానికి.. ఈ విందు .. బీజేపీ రాజకీయాల్లో భాగమన్న చర్చ జరిగింది. అందుకే.. ఈ విందులో ఏదో జరగబోతోందన్న వార్తలు ప్రారంభమయ్యాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు. వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నాలు చేస్తే.. సహించేది లేదని.. జగన్.. ఎంపీలకు చెప్పి పంపినా.. రఘురామకృష్ణంరాజు లైట్ తీసుకున్నారు. తన పలుకుబడి పెంచుకుంటున్నారు. దీన్ని ఎలా అడ్డుకోవాలో వైసీపీ నేతలకు తెలియడం లేదు. ప్రస్తుతానికైతే.. వైసీపీ నాయకత్వానికి రఘురాకృష్ణంరాజు వ్యవహారాల్ని చూస్తూ.. వదిలి వేయడం తప్ప చర్యలు తీసుకునే అవకాశం కూడా లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close