అధికార పార్టీగా కూడా ఆరోపణలేనా.. సాక్ష్యాలేవి అంబటి..?

ఆధారాలతో సహా టీడీపీ నేతల ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలను బయటపెడతామంటూ.. ఉదయం నుంచి మీడియా అందరికీ.. చాలా ఉత్కంఠగా ఎదురు చూసేలా.. చెప్పిన వైసీపీ నేతలు.. చివరికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో చూపించిన వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు. అందులో ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలు చూపించకపోగా… రాజధాని పరధిలో కాకుండా.. కృష్ణా జిల్లాలో కొన్న భూములను కూడా.. ఇన్ సైడర్ ట్రేడింగ్‌ జాబితాలో చేర్చారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ గ్రూప్ కంతేరులో పధ్నాలుగు ఎకరాలు కొన్నదని మరోసారి వైసీపీ నేతలు వీడియో ప్రదర్శించారు. మ్యాప్ కూడా చూపించారు. అందులోనే రాజధాని ఏరియాకు.. కంతేరుకు చాలా దూరం కనిపిస్తోంది.

ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే.. టీడీపీ గెలిచినప్పటి నుండి రాజధాని ప్రకటించే మధ్య కాలంలో జరిగిన లావాదేవీలు. ఈ మధ్య కాలంలో.. నాలుగు వేల ఎకరాలకుపైగా.. లావాదేవీలు జరిగినట్లుగా.. వైసీపీ నేతలు వీడియో చూపించారు. రావెల కిషోర్, కొమ్మాలపాటి శ్రీధర్, పరిటాల సునీత, నారాయణలను కూడా చూపిస్తూ.. భూములు కొన్నారని ఆరోపించారు. ఇవన్నీ.. చాలా కాలంగా చేస్తున్న ఆరోపణలే. వీటికి ఆధారాలుగా డాక్యుమెంట్లను చూపిస్తారేమోనని మీడియా అంతా ఎదురు చూసింది. కానీ ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలు చూపించలేదు కానీ.. సాక్షి పత్రికలో వచ్చిన కథనాలతో.. ఓ డాక్యుమెంటరీని మాత్రం ప్రదర్శించారు.

ఆధారాలతో సహా నిరూపిస్తామని.. వైసీపీ నేతలు చెప్పే సరికి.. మీడియా అంతా ఎంతో ఆసక్తి ప్రదర్శించింది. అందరూ ప్రత్యక్ష ప్రసారం చేశారు. తీరా.. పాత ఆరోపణలను కొత్తగా వీడియో రూపంలో చెప్పి ఊసూరుమనిపించారు. నిజానికి బుగ్గన అసెంబ్లీలో ఆరోపణలు చేసినప్పుడే.. దాదాపుగా అందరూ వివరణ ఇచ్చారు. తాము రాజధాని ప్రకటించక ముందో.. ప్రకటించిన తర్వాతో కొన్నామన్నారు. వారు ఇచ్చిన వివరణకు భిన్నంగా.. వారు ఫలానా సమయంలోనే భూములు కొన్నారని.. డాక్యుమెంట్లు చూపిస్తారేమోనని.. జర్నలిస్టులు భావించారు. ఎందుకంటే.. ప్రభుత్వం వారి చేతుల్లో ఉంది కాబట్టి. అలాంటివేమీ లేకుండా… సాక్షి టీవీలో వచ్చే ఓ ఆరోపణల వీడియోను ప్రదర్శించి.. అవే సాక్ష్యాలు అనుకోమన్నారు వైసీపీ నేతలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close