నిర్ణయం తీసేసుకున్న తర్వాత కేంద్ర జోక్యంతో ఉపయోగమేంటి సుజనా..?

విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించి.. ఉద్యోగులందర్నీ అక్కడికి తరలించి.. అక్కడ్నుంచే పాలన కొనసాగించేందుకు జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రిపేర్ చేసుకున్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెడతామని మొదటి సారి జగన్ ప్రకటన చేసినప్పుడు… సుజనా చౌదరి.. మీడియా ముందుకు వచ్చి.. ఇష్టం వచ్చినట్లుగా.. చేస్తే కేంద్రం ఊరుకోదని హెచ్చరించారు. అప్పట్నుంచి ఇప్పటి వరకూ.. ఓ పది సార్లో.. పదిహేను సార్లో ప్రెస్ మీట్ పెట్టి ఉంటారు. ప్రతీ సారి.. జగన్ ఇష్టం వచ్చినట్లుగా చేస్తే కేంద్రం ఊరుకోదని.. జోక్యం చేసుకుంటుందని చెబుతూ వస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం.. కనీసం.. గవర్నర్ వద్ద నుంచి అయినా.. ఓ నివేదిక తెప్పించుకున్న పాపాన పోలేదు.

సుజనా మాత్రం.. జగన్మోహన్ రెడ్డికి.. హెచ్చరికల్లాంటి బెదిరింపులు కేంద్రం పేరుతో చేస్తూనే ఉన్నారు. రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశం పెట్టనున్న సమయంలో.. మరోసారి ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టిన సుజనా చౌదరి.. అవే హెచ్చరికలు జారీ చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎవరూ ఊరుకోర్నారు. ఎయిమ్స్‌, నిఫ్ట్‌ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాజధాని అని చెప్పి అమరావతికి వచ్చాయని … హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్‌ వంటివి ఒకే చోట ఉండాలని విభజన చట్టం సెక్షన్‌-6లో స్పష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందన్నారు. ఆ సరైన సమయం అధికారిక ప్రకటన వెలువడటం. నిర్ణయం తీసేసుకున్న తర్వాత కేంద్రం జోక్యం చేసుకుని.. ఏం చేయగలుగుతుందో.. సుజనాచౌదరికి తెలియకుండా ఉంటుందని అనుకోలేం.

ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్…. అలాగే.. నిర్ణయం తీసుకోక ముందే.. ప్రభుత్వాన్ని నియంత్రించడమే అమరావతి విషయంలో కీలకం. సుజనా మాత్రం… నిర్ణయం తీసుకున్న తర్వాతే కేంద్రం జోక్యం చేసుకుంటుందంటున్నారు. మొత్తంగా.. కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేయాలని.. సుజనా చేస్తున్న ప్రయత్నాలు.. మాత్రం ఫలించడం లేదని.. ఆయన మాటలతోనే తెలిసిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close