దాడి చేయడానికి వచ్చిన వాళ్లను కదా అరెస్ట్ చేయాల్సింది..?: హైకోర్టు

ముందస్తు అరెస్ట్ చేయాల్సింది దాడి చేయడానికి వచ్చిన వారిని కానీ.. పర్యటనకు పర్మిషన్ తీసుకున్న వారిని ఎలా అరెస్ట్ చేశారని.. హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చంద్రబాబు విశాఖ పర్యటనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న ఘటనపై టీడీపీ నేతలు దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారపక్షానికి ఒక రూల్‌.. ప్రతిపక్షానికి మరో రూల్‌ ఉంటుందా .. చట్టం ముందు అందరూ సమానమే కదా అని హైకోర్టు ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన తర్వాత.. 151 కింద నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. ముందస్తు అరెస్ట్‌ చేయాల్సింది రాళ్లు, కోడిగుడ్లు వేయడానికి వచ్చిన వాళ్లని కదా.. ఆందోళనకారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడగడంతో.. ప్రభుత్వం తరపు న్యాయవాది నోరు విప్పలేకపోయారు.

ఆందోళనలు చేస్తామని చెప్పిన వారిని ఎయిర్‌పోర్టుకు రాకుండా ఎందుకు నిలువరించలేకపోయారని ప్రశ్నించింది. 151 సీఆర్పీసీ నోటీసు చంద్రబాబుకు ఇవ్వటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరస్థులు, నేరాలు చేసే ఆలోచన ఉన్నవారికి మాత్రమే..151 సీఆర్పీసీ నోటీసు ఇస్తారు కదా.. అని ప్రశ్నించింది. ప్రతిపక్ష నేతకు ఎందుకు షరతులు విధిస్తున్నారని.. ప్రజాస్వామ్య దేశంలో ఇలా చేయటం ఏంటని న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై.. మార్చి రెండో తేదీలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని డీజీపీ, విశాఖ సీపీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 2కి వాయిదా వేసింది.

హైకోర్టు విచారణలో ప్రభుత్వం తరపు న్యాయవాది చంద్రబాబును ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందో వివరించలేకపోయారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై… హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. చట్ట విరుద్ధంగా చేస్తున్నారంటూ… దాదాపుగా ప్రతీ కేసులోనూ.. విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపైనా.. అదే తరహా విమర్శలు వచ్చాయి. హైకోర్టులో ప్రతీ రోజూ.. ప్రభుత్వానికి సంబంధించిన పిటిషన్లే ఎక్కువగా విచారణకు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close