స్థానికం ఎఫెక్ట్… బీజేపీ, జనసేన డిష్యుం.. డిష్యుం..!?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక పోరు ప్రారంభమైంది. తక్కువ సమయంలోనే స్థానిక ఎన్నికలు రానున్నాయి. దీంతో రాజకీయ పార్టీలలో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. తొమ్మిది నెలల తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ఎత్తుగడలకు తెర లేచింది. పొత్తులు, ఎత్తులు, రాజకీయ వ్యూహాలు ఊపందుకుంటున్నాయి. స్థానిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అధ్యక్షుడు పిలుపు కార్యకర్తలకు చేరింది కానీ వారి మనసులు మాత్రం కమలంతో కలయికను వ్యతిరేకిస్తున్నాయని అంటున్నారు. సాధారణ ఎన్నికలకు, స్థానిక ఎన్నికలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని, స్థానికంగా ఉన్న వారు ఎన్నాళ్ల నుంచో సత్సంబంధాలు కలిగి ఉంటారని, అలాంటి వారిని బీజీపీకి ఓటు వేయమని అడగడం ప్రజల ముందు తల దించుకోవడం వంటిదేనని జనసేన స్థానిక నాయకులు అంటున్నారు. ఢిల్లీలో చేసుకున్న ఒప్పందానికి, గ్రామ గల్లీలో తిరిగే మాకు చాలా తేడా ఉంటుందని, ఇది గ్రహించకుండా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కమలంతో కలిసి నడవాలని చెప్పడం సమంజసం కాదని వారంటున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా జనసేనతో పొత్తుపై పెదవి విరుస్తున్నారు. గత ఎన్నికలలో కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచిన జనసేనతో కలిసి ఎలా పోటీ చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ఆ ఎన్నికలలో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారని, అలాంటి పార్టీతో ఎలా కలుస్తామని కమలనాథులు వాపోతున్నారు. గతంలో కూడా ఇలాంటి పొత్తుల కారణంగానే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎదగలేక పోయిందనే విషయం గుర్తుపెట్టుకోవాలని, మళ్లీ అలాంటి తప్పు చేయవద్దని బిజెపి నాయకులు అధిష్టానాన్ని కోరుతున్నారు. పైగా స్థానిక ఎన్నికలలో పార్టీల కంటే స్థానిక అభ్యర్థులకు ఎక్కువ విలువ ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కమలనాథులు సూచిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close