ఏప్రిల్ ఫూల్ : ఈఎమ్‌ఐ వాయిదా వేసుకుంటే వడ్డీ బాదుడే..!

లాక్ డౌన్ కారణంగాహోమ్ లోన్, కారు లోన్, పర్సనల్ లోన్.. ఇలా అన్నిరకాల లోన్లపై ఈఎమ్‌ఐలు మూడు నెలల పాటు కట్టక్కర్లేదని ఆర్బీఐ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే.. అందులో ఉన్న డొల్ల ఏమిటో.. మెల్లగా ఒకటో తేదీ వచ్చే సరికి బయటపడింది. యాధృచ్చికంగా అది ఏప్రిల్ ఒకటి కావడం.. మరింత విశేషం. బ్యాంకులు ఈఎమ్‌ఐ వసూలును నిలిపివేయడం లేదు. రిక్వెస్ట్ పెట్టుకున్న వారివి మాత్రమే వసూలు నిలిపివేస్తాయి. అలా రిక్వెస్ట్ పెట్టుకుంటే… ” టర్మ్స్ అండ్ కండిషన్స్”ని అంగీకరించినట్లే. ఈ ” టర్మ్స్ అండ్ కండిషన్స్”లో ముఖ్యమైనదే. వాయిదా వేసిన మొత్తానికి వడ్డీ కట్టేందుకు .. అంగీకరించడం. అంటే.. ఈ మూడు ఈఎమ్‌ఐల మీద వడ్డీ చెల్లించడానికి సిద్ధపడటం.

మూడు నెలలు ఈఎమ్‌ఐ కట్టలేమని.. బ్యాంకుకు అప్లయ్ చేసుకుంటే… వడ్డీ బారీగా పడుతుంది. ఉదాహరణకు.. 9.5 శాతం వడ్డీకి 20 లక్షల గృహరుణం ఉందనుకుందాం. దానిపై మూడు నెలలు ఈఎమ్‌ఐ మారటోరియానికి ధరఖాస్తు చేసుకుంటే… మూడు నెలలకు దాదాపుగా రూ. అరవై వేలు ఈఎమ్‌ఐ కట్టాల్సిన పని ఉండదు. కానీ ఈ మొత్తం రుణానికి యాడ్ అవుతుంది. ఈఎమ్‌లో అసలు, వడ్డీ కలిపి.. రుణానికి కలిపేసి.. మళ్లీ దాని మీద.. వడ్డీ వేస్తారు. అంటే.. కట్టాల్సిన నెలల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. మూడు నెలల ఈఎమ్‌ఐ వాయిదా వేసుకున్నందున.. అది … ఆరు నెలల నుంచి పది నెలల వరకూ కట్టాల్సిన గడువు పెరుగుతుంది. ఒక వేళ ఈ నెలలు పెరగకుండా ఉండాలంటే.. మూడు నెలల తర్వాత ఈఎమ్‌ఐ పెంచుకోవాలి. ఎలా చూసినా.. మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటే… రుణ గ్రహీతలకు భారమే కానీ.. లాభం నయాపైసా ఉండదు.

ఆర్బీఐ మారటోరియాన్ని ఊరటగా ప్రకటించినప్పటికీ వాస్తవంలో మాత్రం.. బాదుడే. మారటోరియాన్ని అన్ని విధాలుగా ఆలోచించి ఎంచుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మారటోరియం ఎంచుకుంటే భారమే కాబట్టి రుణగ్రహీతలు తప్పనిసరి అనుకుంటేనే ఆర్బీఐ ఇచ్చిన ఆప్షన్ ఎంచుకోవాలి. నెలవారీ ఆదాయాలు రాని పక్షంలో, వేతనాలు నిలిచిపోతే, అత్యంత కష్టంగా ఉంటే మాత్రమే మారటోరియం ఎంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close