తెలంగాణలో మరో 43 పాజిటివ్ కేసులు.. టోటల్ 272..!

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. శనివారం రోజు.. ఈ సంఖ్య 43కి చేరింది. వివిధ జిల్లాల్లో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారు.. వారి పాజిటివ్ కేసులు కలిపి… వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారికి ఈ వైరస్ సోకింది. ఆదిలాబాద్ నుంచి నల్లగొండ వరకూ.. పాజిటివ్ కేసులు తేలిన వారు ఉన్నారు. వరంగల్‌లోనూ పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 90 శాతం వరకూ పాజిటివ్ కేసులు బయటపడుతూ వచ్చాయి. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి వల్ల జిల్లాల్లోనూ ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం రోజు.. 75 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ 32 మంది కి కరోనా నయం అయింది.

దేశం మొత్తం తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వెళ్లిన వారి కారణంగానే… పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో అత్యధికంగా పాజిటివ్ కేసులు ఉన్న మహారాష్ట్రలో శనివారం మరో 47 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. వీరందరూ తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వెళ్లిన వారే. తమిళనాడు, కర్ణాటకల్లోనూ.. అత్యధికంగా తబ్లిగీలకే పాజిటివ్ గా తేలుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మూడు వేల పాజిటివ్ కేసులు దాటిపోయింది. మృతుల సంఖ్య వందకు చేరువ అవుతోంది. మరో వైపు ప్రధానమంత్రి దేశంలోని పరిస్థితులపై విపక్షాలతో చర్చించాలని అనుకుంటున్నారు.

ఎనిమిదో తేదీన అఖిలపక్ష సమావేశాన్ని.. ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరగనున్న ఈ భేటీలో.. లాక్ డౌన్ అనంతర పరిస్థితుల్ని చర్చిచే అవకాశం ఉంది. తబ్లిగీలు తప్ప.. ఇతర పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గిపోయినందున.. లాక్ డౌన్ రిలాక్సేషన్ ఇస్తే ఎలా ఉంటుందన్నదానిపై విపక్షాల సూచలను ప్రధాని తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close