దేశానికి ఆశాకిరణంగా విశాఖ మెడ్‌టెక్‌జోన్ ..!

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వైద్య పరికరాల కొరత ఉంది. కరొనా అన్ని దేశాలను చుట్టుముట్టడంతో.. ఆరోగ్య పరంగా ఎంతో మెరుగైన సదుపాయాలున్న దేశమైనా.. కొత్త పరికాల కోసం చూస్తోంది. ఏ దేశానికి ఆ దేశం ఎగుమతుల్ని నిషేధిస్తోంది. ఇలాంటి సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌కు.. దేశానికి విశాఖ మెడ్‌టెక్ జోన్ ఆశాకిరణంగా మారింది. మెడ్‌టెక్‌జోన్‌లో ప్రస్తుతం కోవిడ్ -19 టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు ఉత్పత్తి చేస్తున్నారు. 10వ తేదీ నుంచి ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తాయి. వీటి కారణంగా.. ఏపీలో మరింత మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే అవకాశం ఉంది. మెడ్ టెక్ జోన్ దేశంలోనే వైద్య పరికరాల ఉత్పత్తిలో అత్యంత కీలకంగా మారబోతోందని .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

కరోనా వల్ల వివిధ దేశాలు కరోనా కిట్లు, వెంటిలేటర్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి. వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉండటంతో.. కార్ల కంపెనీల్లో.. వెంటిలేటర్లు తయారు చేయాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే ఒక్క మెడ్‌టెక్‌జోన్‌లోనే నెలకు 3వేల వెంటిలేటర్లు తయారు చేసే అవకాశం ఉంది. టెస్టింగ్ కిట్లు ఈనెలలో పదివేలు 10 వేల వరకు, మే నుంచి 25 వేల వరకు తయారు చేయొచ్చు. నిజానికి ఈ మెడ్‌టెక్ జోన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. చంద్రబాబు హయాంలో ప్రారంభమైన ఈ మెడ్‌టెక్‌ జోన్‌కు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చిక్కులు ఏర్పడ్డాయి. టెస్టింగ్ ల్యాబ్స్‌ ఏర్పాటు కాకుండా.. చిక్కులు ఏర్పడ్డాయి. సంస్థ సీఈవో జితేందర్ శర్మను.. రెండు సార్లు తొలగించిన ఏపీ సర్కార్.. చివరికి మళ్లీ నియమించాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో… గత పది నెలలుగా మెడ్ టెక్‌జోన్‌ అభివృద్ది జరగలేదు.

ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మెడ్ టెక్ జోన్‌లో ఉన్న సంస్థలే…ఆశాకిరణంగా కనిపిస్తూడటంతో.. కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఉత్పత్తులు మార్కెట్లోకి రాక ముందు వాటిని పరీక్ష చేసి విడుదల చేయాల్సి ఉంటుంది. వాటి కోసం లాబ్స్ అవసరం అవుతాయి. వాటిని ఏర్పాటు చేసే విషయంలో చిక్కులు తెచ్చి పెట్టారు. ఇప్పుడు శరవేగంగా ఆటంకాలు తొలగించనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close