అయితే పచ్చ మీడియా..లేకపోతే కులం..! వైసీపీ ఎదురుదాడి అస్త్రాలు ఈ రెండే..!?

ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్శిటీల పాలక మండళ్ల నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న దశలో.. యంత్రాంగం మొత్తం… దానిపైనే దృష్టి పెట్టినా… హఠాత్తుగా వర్శిటీల పాలకమండళ్లను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం అసలు సమస్యను కాక.. ఇతర అంశాల్లోనే చురుగ్గా ఉందేమోనని అనుకునేలా ఆ ఉత్తర్వులు ఉన్నాయి. సిఫార్సుల మేరకు.. ఒకే సామాజికవర్గానికి అత్యధికం కట్టబెట్టినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కొన్ని యూనివర్శిటీల పరిధిలోని పాలక మండళ్లలో మెజార్టీ ఒకే సామాజికవర్గం వారు ఉన్నారు. నియమితులైన వారందరూ… సిఫార్సుల మీద వచ్చిన వారే. ఎవరెవరు సిఫార్సు చేశారో కూడా.. . ఫైల్స్‌లో రాయడం.. సంచలనం సృష్టిస్తోంది.

మీడియాలో ఏపీ సర్కార్ తీరుపై ఒక్క సారిగా విమర్శలు రావడంతో… దానికి కౌంటర్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి.. మీడియా పైనా.. టీడీపీపైనా ఎదురుదాడి చేశారు కానీ.. నియామకాల్లో వచ్చిన ఆరోపణలపై వివరాలు ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఒకే సామాజికవర్గానికి పెద్ద పీట వేశారనే ఆరోపణలు మీడియా నుంచి.. విపక్ష నేతల నుంచి వచ్చాయి. అయితే.. తాము యాభై శాతం మేర.. రిజర్వేషన్లు పాటించామని.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మహిళలకు కేటాయించామని చెప్పుకొచ్చారు. పచ్చ మీడియా అంటూ… ఈ ఆరోపణలు చేసిన వారిపై మండిపడ్డారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో అంత కంటే దారుణంగా నియామకాలు జరిగినా ప్రశ్నించలేదని తప్పు పట్టారు.

ప్రభుత్వ వ్యవహారాల్లో జరుగుతున్న ప్రతి పనిలోనూ… విమర్శలు వచ్చినప్పుడు.. ఆయా వర్గాల ఎదురుదాడి.. అయితే పచ్చ మీడియా అని లేకపోతే.. వాళ్లని ఫలానా సామాజికవర్గమనే ఎదురుదాడి చేస్తున్నారు తప్ప… తమపై వచ్చిన ఆరోపణలకు.. సమాధానం ఇవ్వడానికి సిద్ధపడలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ అలా చేసిందని వాదిస్తున్నారు. నిజంగా గత ప్రభుత్వం అలాగే చేసిందని ఎదురుదాడి చేస్తే.. ఆ ప్రభుత్వానికి ప్రజలు ఏ గతి పట్టించారో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. మరి వాళ్లు చేసినట్లుగానే మేము చేస్తామనే వాదనను ఎందుకు వైసీపీ సర్కార్ చేస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close