చిరు.. కొర‌టాల‌.. వెర్ష‌న్ల‌లో ఎంత తేడా?

‘ఆచార్య‌’లో మ‌హేష్ బాబు ఎపిసోడ్ లో ఓ క్లారిటీ అయితే వ‌చ్చింది. ఈ సినిమాలో మ‌హేష్ బాబు లేడు. ఆ పాత్ర రామ్ చ‌ర‌ణ్ చేస్తున్నాడు. అయితే.. మ‌హేష్ విష‌యంలో చిరంజీవి చెప్పిన వెర్ష‌న్‌కీ, కొర‌టాల శివ చెప్పిన వెర్ష‌న్‌కీ చాలా తేడా వుంది.

‘ఆచార్య‌’లో మ‌హేష్ న‌టిస్తున్నాడ‌న్న వార్త‌లు రావ‌డం, రోజుకి కోటి చొప్పున 30 రోజుల‌కు, 30 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడ‌న్న సంగ‌తి మీడియాకు లీకైంది. అయితే.. ఆ త‌ర‌వాత మ‌హేష్ త‌ప్పుకున్నాడు. ఇదే విష‌య‌మై చిరుని ఓ ఇంట‌ర్వ్యూలో అడిగితే.. ‘అస‌లు ఈ వార్త ఎలా పుట్టిందో తెలీదు.. అస‌లు మ‌హేష్ మా చ‌ర్చ‌ల్లోకి రాలేదు’ అని చెప్పేశాడు. స్వ‌యంగా చిరంజీవే క్లారిటీ ఇచ్చాడు కాబ‌ట్టి.. మ‌హేష్ ది కేవలం పుకారే అని స‌రిపెట్టుకున్నారు ఫ్యాన్స్‌.

ఈ రోజు ఓ దిన ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కొర‌టాల శివ మ‌రో వెర్ష‌న్ చెప్పుకొచ్చాడు. ఈ క‌థ‌లో రామ్ చ‌ర‌ణ్ చేయాల్సిన పాత్ర ఒక‌టుంద‌ని, అయితే ఆర్‌.ఆర్‌.ఆర్ ఆల‌స్యం వ‌ల్ల చ‌ర‌ణ్ త‌మ టీమ్ లో జాయిన్ అవ్వ‌డం కుద‌ర‌దేమో అని భ‌య‌ప‌డుతున్న త‌రుణంలో స‌మ‌స్య‌ని అర్థం చేసుకున్న మ‌హేష్ స్వ‌యంగా… ‘నేనున్నాను.. భ‌య‌ప‌డ‌కండి’ అంటూ కొర‌టాల‌కు అభ‌యం ఇచ్చాడ‌ని… స్వ‌యంగా కొర‌టాలే చెప్పాడు. క‌నీసం పాత్ర ఏమిట‌న్న‌ది కూడా ఆలోచించ‌కుండా.. ‘నేను న‌టిస్తా’ అని మ‌హేష్ మాట ఇవ్వ‌డం గొప్ప విష‌య‌మ‌ని, ఇది త‌న‌కూ మ‌హేష్‌కీ జ‌రిగిన అంద‌మైన ఎపిసోడ్ అని, అయితే మీడియా దాన్ని మ‌రీ పెద్ద‌ది చేసి రాసేసింద‌ని క్లారిటీ ఇచ్చాడు కొర‌టాల‌. అంటే ఈ పాత్ర గురించి మ‌హేష్ కి తెలుసు. చ‌ర‌ణ్ స్థానంలో మ‌హేష్‌ని తీసుకోవాలా, వ‌ద్దా అనే విష‌యంలో భారీ ఎత్తున చ‌ర్చ జ‌రిగిన మాటా నిజ‌మే. కానీ… మ‌ళ్లీ నిర్ణ‌యాలు మారిపోయాయి. మ‌హేష్ లైట్ తీసుకున్నాడు. తెర వెనుక ఇంత త‌తంగం జ‌రిగితే.. ‘మ‌హేష్ పేరు ఎలా వ‌చ్చింద‌బ్బా’ అని చిరు ఆశ్చ‌ర్య‌పోవ‌డం నిజంగా పెద్ద ఆశ్చ‌ర్య‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close