ఆ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఆకాశం నుండి ఊడిపడ్డారా..?

కరోనా కాలంలోనూ పూలబాటలో నడిచే ప్రజాప్రతినిధులు ఉంటారా..? రూ. ఐదు రూపాయల సాయం చేసి దాన్ని రూ. ఐదు లక్షలు పెట్టి ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకునే వారు ఉంటారా..?. ఛీ.. ఛీ అలా ఎవరూ చేయరండి.. ప్రజాస్వామ్యంలో ఓట్లు వేసేది ప్రజలే కదా.. వారికి కష్టం వచ్చినప్పుడు ఇలా ఎలా చేస్తారు.. అని మనలో చాలా మందికి అనిపిస్తుంది. నిజమే .. దేశంలో ఎక్కడా.. ఎవరూ అలాంటి పనులు చేయరు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే.. ఇలాంటి చిత్రవిచిత్రాలు అన్నీ ఏపీలో జరుగుతూంటాయి.

నగరి ఎమ్మెల్యే రోజా కరోనా వైరస్ వచ్చినప్పటి నుండి ఫోకస్‌లో ఉన్నారు. ఆమె నగరిలో అప్పుడప్పుడూ… వైరస్ నిరోధక ద్రావణాన్ని పీపీఈ కిట్లు వేసుకుని మరీ చల్లుతున్నారు. అక్కడక్కడా అన్నదానం ప్రోగ్రాంలు పెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన వెయ్యి రూపాయల పంపిణీని దగ్గరుండి చూసుకున్నారు. కొన్ని అనుకూలమైన మీడియాల్లో.. ప్రజల్లోనే ఉంటున్నానని… కరోనాకు భయపడలేదని… ఇంటర్యూలు ఇచ్చారు. అంత వరకూ బాగానే ఉన్నా.. తాజాగా ఆమె ఓ గ్రామానికి వెళ్లారు. మామూలుగా వెళ్లలేదు… అంటే ఎన్ 95 మాస్కులు.. చేతులకు గ్లౌజులు వేసుకుని వెళ్లడం కాదు.. రెడ్ కార్పెట్ పరిపించుకుని.. తాను నడుస్తూండగా.. గ్రామస్తులంతా.. లైన్లలో నిల్చుని ఆమె పాదాలపై పూలు చల్లుతూండగా… అలా రాజసంగా నడుచుకుంటూ వచ్చారు. దాన్ని పరోక్షంగా అయినా సోషల్ మీడియాలో వైరల్ చేసుకుని ఆనందపడిపోయారు. కరోనా దెబ్బకు గ్రామీణ ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది. వారికి నిత్యావసర సరుకులు అందించాల్సిన పరిస్థితి. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని రోజా.. ఇలా పాదపూజలు చేయించుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మరో మహిళా ఎమ్మెల్యే విడదల రజనీ హడావుడి కూడా దీనికే మాత్రం తగ్గట్లేదు. సోషల్ మీడియా టీంను నియమించుకున్న ఆమె..వారికి జీతాలు కోసం కొన్ని లక్షలు వెచ్చిస్తున్నారు. రోజువారీగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో.. ఎలా ప్రచారం చేయాలో వారు డిజైన్ చేస్తున్నారు. దాని ప్రకారం.. రోజులో… ఒకటి రెండు చోట్లకు వెళ్తారు. ఆమె పర్యటనను నాలుగైదు కెమెరాల్లో చిత్రీకరిస్తారు పబ్లిస్టిటీ సిబ్బంది. అంత కష్టపడి ఎక్కువ మంది చూడకపోతే ఎలా అనుకున్నారేమో.. సోషల్ మీడియాలో స్పాన్సర్డ్ విభాగం కింద డబ్బులు ఖర్చు పెట్టి మరీ వైరల్ చేసుకుంటున్నారు. ఒక్క నెలలో ఆమె సోషల్ మీడియా బడ్జెట్ ఎనిమది లక్షలు దాటిపోయిదన్న లెక్కలు వచ్చాయి. పేదలకు ఆమె చేసిన సాయం అంత లేదు.

ఇలాంటి నేతలు… నిస్సహాయాలైన ప్రజలకు ఒక్క పూట కడుపు నింపి.. తాము దానకర్ణులమని.. శివగాములం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చుకోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. పబ్లిసిటీ కోసమే.. సాయం చేస్తున్నట్లుగా వీరి తీరు ఉంది. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి ఉండదు.. ఒక్క ఏపీలోనే ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close