కేసీఆర్, జగన్.. సోడా, విస్కీలా కలిసిపోయారట..!

పోతిరెడ్డిపాడుపై జగన్ జారీ చేసిన జీవో ప్రగతి భవన్‌లో తయారైందని.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, జగన్ సోడా, విస్కీల్లా కలసిపోయారని.. వారిద్దరినీ విడివిడిగా చూడాలేమని ఆయనంటున్నారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు కేసీఆర్ ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదని రేవంత్ చెబుతున్నారు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు వివాదం కూడా.. టాపిక్ డైవర్షన్ కోసమే.. ఇద్దరు సీఎంలు.. మళ్లీ తెరపైకి తెచ్చారన్న అభిప్రాయంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. మళ్లీ సెంటిమెంట్‌ను పండించేందుకే కేసీఆర్, జగన్ ఇలా ప్లాన్ చేసారనేది రేవంత్ రెడ్డి అభిప్రాయం.

నిన్నామొన్నటిదాకా… కేసీఆర్, జగన్ రాజకీయ మిత్రులు. ఇప్పుడు కూడా కాదు అనేంత విబేధాలు వారి మధ్య రాలేదు. ఏ విషయంలోనూ.. ఇప్పటి వరకూ రెండు రాష్ట్రాలు విభేదించుకున్న పరిస్థితి లేదు. ఉమ్మడిగా ప్రాజెక్టు కట్టాలనుకున్నారు కూడా. రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని స్వయంగా కేసీఆర్ చిత్తూరు జిల్లాలో.. రోజా ఇంటికి అతిథిగా వెళ్లి మరీ హామీ ఇచ్చి వచ్చారు. అలాంటిది…కేసీఆర్ సహకారంతోనే జగన్మోహన్ రెడ్డి .. రాయలసీమకు నీళ్లు అందించే ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఉండవచ్చు. కానీ.. అనూహ్యంగా ఏకపక్షంగా… తెలంగాణలో సెంటిమెంట్ పెరగడానికి అవకాశం ఉండే విధంగా… సున్నితమైన పోతిరెడ్డి పాడు ఇష్యూనే ఏపీ సీఎం.. హైలెట్ చేశారు.

ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. కర్నూలు బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. జగన్, కేసీఆర్ కావాలనే చేస్తున్నారని అంటున్నారు. కొన్ని రోజులు హడావుడి చేసి.. తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అడ్డుకుంటున్నారని చేతులెత్తేస్తారని ఆయన అభిప్రాయం. మొత్తానికి… కృష్ణా జలాలపై.. రెండు రాష్ట్రాల మధ్య చెలరేగిన కొత్త వివాదాన్ని ఎవరూ రాజకీయ యుద్ధంగా చూడటం లేదు. ఇదో వ్యూహంగా మాత్రమే అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close