సర్పంచ్‌తో సీఎం..! కేసీఆర్ స్టైలే వేరు..!

తెలంగాణ సీఎం కేసీఆర్… ఓ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపాలంటే.. చాలా సింపుల్ టెక్నిక్ ఎంచుకుంటారు. గతంలో రెవిన్యూ సంస్కరణలు తేవాలనుకున్నప్పుడు.. భూవివాదాన్ని పరిష్కరించుకోలేక.. అధికారుల చుట్టూ తిరగలేక సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తికి నేరుగా ఫోన్ చేసి…మాట్లాడారు. ఆ తర్వాత అది చాలా మార్పులకు కారణం అయింది. ఆ తర్వాత కూడా వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు హఠాత్తుగా ఫోన్లు చేసి ఆశ్చర్యపరిచారు. తాజాగా.. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ గ్రామ సర్పంచ్‌ భాస్కర్‌కు ఫోన్ చేశారు. క్షేమ సమచారాలు అడిగారు. తర్వాత కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం గురించి చర్చించారు.

కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తానే వస్తున్నానని… గోదావరి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాకు, నియోజకవర్గానికి, గ్రామానికి వస్తున్నని… వేడుక ధూంధాంగా చేసుకుందామన్నారు. 1500 మందితో భోజనాలు చేసుకుందామని అవసరమైన ఏర్పాట్లన్నీ చూడమని పురమాయించారు. అంతే కాదు.. ఇంకేమైనా అభివృద్ధి పనులు కావాలా అని అడిగారు. గ్రామపంచాయతీ భవనాన్ని మంజూరు చేయాలని సర్పంచ్‌ కోరగా.. గ్రామానికి వచ్చిన రోజునే.. గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి, రైతువేదిక నిర్మాణానికి భూమి పూజ చేద్దామని ప్రకటించేశారు. మరో ఐదారు కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు కూడా చేపడదామన్నారు. తర్వాత మరికొన్ని గ్రామాల సర్పంచ్‌లకు కూడా ఫోన్లు చేశారు.

కేసీఆర్.. ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. ఆ ఫలాలు ఇప్పుడు ప్రజల దగ్గరకు చేరుతున్నాయి. అలా చేరుతున్న సందర్భంలో తనదైన మార్క్.. ప్రజల మీద పడాలంటే.. కేసీఆర్ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసీఆర్ ను కలకలం గుర్తు పెట్టుకునేలా ప్రజలు ఉండేలా.. సింపుల్‌గా ఆ ప్రయత్నాలు ఉంటాయి. నేరుగా వారితో కలిసి.. పండగ చేసుకోవడం అందులో ఒకటి. అందుకే.. కేసీఆర్ లాంటి రాజకీయం…. ఇంకెవరూ చేయలేరు. మంచి చేస్తారు.. దానికి తగ్గట్లుగా పేరూ తెచ్చుకుంటారు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close