హైకోర్టు జడ్జిలపై నిందలు.. ఆమంచి, నందిగం సహా 49 మందికి నోటీసులు..!

హైకోర్టు ఇచ్చిన తీర్పుల విషయంలో న్యాయమూర్తులపై మీడియాలో.. సోషల్ మీడియాలో విపరీత వ్యాఖ్యలు చేస్తున్న వారి వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి సహా 49 మందికి నోటీసులు జారీ చేసింది. నందిగం సురేష్‌తో పాటు ఆమంచి కృష్ణమోహన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను న్యాయమూర్తులు పరిశీలించారు. తదుపరి విచారణను 3 వారాలు వాయిదా వేశారు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగిస్తూ.. హైకోర్టు ధర్మానసం తీర్పు చెప్పిన తర్వాత.. న్యాయమూర్తులపై వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బాపట్ల ఎంపీ నందిగం సురేష్.. నేరుగా.. వైసీపీ కార్యాలయంలోనే ప్రెస్‌మీట్ పెట్టి… హైకోర్టును… మ్యానేజ్ చేస్తున్నారని ఆరోపించారు. తీర్పులు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తెలుస్తున్నాయని.. చంద్రబాబు కాల్ లిస్ట్ పై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నందిగం సురేష్ వ్యాఖ్యలు రాజకీయవర్గాలతో పాటు… న్యాయవర్గాల్లోనూ కలకలం రేపాయి. అదే సమయంలో.. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్… హైకోర్టు తీర్పుపై .. లాక్ డౌన్ లేకపోతే ధర్నాలు చేసేవారమని చెప్పుకొచ్చారు. జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటి వీడియోలు.. సోషల్ మీడియా పోస్టులు… హైకోర్టుకు చేరాయి.

ఇక వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక పోస్టులు పెట్టారు. న్యాయమూర్తులను అసభ్యంగా తిడుతూ.. కులతత్వాన్ని అంటగడతూ… విమర్శలు చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే సరే.. లేకపోతే.. మాత్రం.. కోర్టులను మేనేజ్ చేశారని.. ఇతర పార్టీల నేతలతో లింక్ పెట్టడమో.. కుల తత్వాన్ని అంటగట్టడమో చేయడం ద్వారా …న్యాయవ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిపోయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చట్ట ప్రకారం.. రాజ్యాంగం ప్రకారం..తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.. న్యాయస్థానాలు ప్రశ్నించకూడదన్న రీతిలో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని… ఇలా.. ఉద్దేశాలు ఆపాదించి ప్రచారం చేస్తూ.. ఓ రకంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు… వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారికి నోటీసులు జారీ చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close