కోర్టు ను విమర్శించిన మా వాళ్ళంతా నిరక్షరాస్యులే: వైకాపా నేత

ఇటీవలికాలంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తీసుకుంటున్న అవకతవక నిర్ణయాలను కోర్టులు తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యంలో ఏది పడితే అది చేయడానికి కుదరదని ప్రభుత్వాలకు కోర్టులు గుర్తు చేయాల్సి రావడం శోచనీయం. అయితే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వివరాల్లోకి వెళితే

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం , బిల్డ్ ఏపీ పేరిట ప్రభుత్వ (అంటే ప్రజల) ఆస్తుల అమ్మకానికి ప్రయత్నించడం, వంటి అనేక నిర్ణయాలు కోర్టు చేత మొట్టికాయలు తినేలా చేశాయి. అయితే వై ఎస్ ఆర్ సి పి అభిమానులు కోర్టుల మీద దూషణలకు పాల్పడడం, సోషల్ మీడియాలో కోర్టు తీర్పులను తప్పు పడుతూ జడ్జీలను సైతం దుర్భాషలాడటం చేయడంతో కోర్టు దీనిని తీవ్రంగా పరిగణించి సుమోటోగా కేసు నమోదు చేసింది. తమ పార్టీ తప్పు నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన హైకోర్టును , చివరికి జడ్జిలను కూడా విమర్శించిన ఒక ఎంపీ , ఒక మాజీ ఎమ్మెల్యే , 47 మంది ఇతరులకు కోర్టు ధిక్కార నోటీస్ హైకోర్టు జారీ చేసింది. దీంతో టీవీ డిబేట్ లలో వైఎస్సార్సీపీ ని వెనకేసుకు రావడానికి ఆ పార్టీ నేతలు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

అయితే వైఎస్ఆర్ సీపీ ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ టీవీ ఛానల్ లో మాట్లాడుతూ, కోర్టు మీద విమర్శలు చేసిన తమ వాళ్లంతా ఇల్లీటరేట్స్ అని , ( నిరక్షరాస్యులు) కోర్టుల తీరు పై అవగాహన లేకపోవడంతోనే వారు అలా చేయాల్సి వచ్చిందని, తాను కోర్టుకు వారందరి తరఫున క్షమాపణ వేడుకుంటున్నాను అని అన్నారు. అయితే విమర్శలు చేసిన వై ఎస్ ఆర్ సి పి ఎంపీ, ఆ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కూడా నిరక్షరాస్యులైనా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. అద్దేపల్లి శ్రీధర్ వ్యాఖ్యలతో, ఇంతకాలం ఇతర పార్టీల అభిమానులను నిరక్షరాస్యులుగా పిలుస్తున్న వైఎస్ఆర్సిపి అభిమానుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా అయింది. మరోవైపు, ఆ మధ్య తన నిర్ణయాన్ని శాసనమండలి వ్యతిరేకిస్తే దానిని రద్దు చేయడానికి జగన్ నిర్ణయం తీసుకున్నాడని, ఇప్పుడు హైకోర్టును కూడా రద్దు చేయాలని జగన్ అంటారేమో అంటూ మరికొందరు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

ఏది ఏమైనా కోర్టుల మీద విమర్శలు చేసే ముందు , ఏ పార్టీకి చెందిన వారైనా సరే, కొంత ఆచితూచి మాట్లాడాలనే పాఠాన్ని ఈ వ్యవహారం నేర్పించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close