మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్‌కి స‌ర్వం సిద్ధం

ఒలంపిక్స్‌లో ప‌త‌కం సాధించి తెలుగువాళ్లంతా గ‌ర్వ‌ప‌డేలా చేసిన క్రీడాకారిణి క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి. ఇప్పుడు త‌న క‌థ వెండి తెర‌పై రాబోతోంది. సంజ‌నా రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శకురాలు. క‌థ‌, స్క్రీన్ ప్లే కోన వెంక‌ట్ అందించారు. ఆయ‌న‌తో పాటు కోనేరు స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఇది మ‌రో పాన్ ఇండియా ప్రాజెక్టు. క‌ర‌ణం మల్లీశ్వ‌రి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈచిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి పాత్ర‌లో ఎవ‌రు క‌నిపిస్తార‌న్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. భూమి ప‌డ్నేక‌ర్ క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రిగా క‌నిపిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అప్ప‌టికి పాన్ ఇండియా ఆలోచ‌న లేదు. అందుకే ఓ స్టార్ క‌థానాయిక‌నే మ‌ల్లీశ్వ‌రి పాత్ర‌కోసం ఎంచుకోవాల‌ని కోన వెంక‌ట్ భావిస్తున్నారు. మ‌రి.. ఆ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close