టాలీవుడ్‌కి ‘డేంజ‌ర్‌’ బెల్స్‌

బండ్ల గ‌ణేష్‌కి క‌రోనా… అనే వార్త టాలీవుడ్ లో క‌ల‌క‌లం రేపుతోంది. `నాకు క‌రోనా ఉంది` అని గ‌ణేష్ ప్ర‌క‌టించ‌లేదు గానీ, మీడియా అంత‌టా ఇదే హాట్ టాపిక్‌. ఇదే నిజ‌మైతే టాలీవుడ్ లో క‌రోనా బారిన ప‌డిన తొలి వ్య‌క్తి గ‌ణేష్ అవుతాడు.

టాలీవుడ్ ఇప్పుడు షూటింగుల కోసం ఎదురు చూస్తోంది. క‌రోనా భ‌యాలు వెంటాడుతున్నా, స్టార్లు సెట్లో అడుగుపెట్ట‌డానికి జంకుతున్నా – ఏదోలా షూటింగు చేసుకోవాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. హీరోల్ని ఎలాగోలా ఒప్పించి.. వాళ్ల‌ని సెట్స్‌పైకి తీసుకురావాల‌ని ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. ఈ ద‌శ‌లో `బండ్ల‌కు క‌రోనా` వార్త‌.. ముంద‌ర కాళ్ల‌కు బంధం వేసేలా మారింది. నిర్మాత‌ల కోస‌మో, త‌మ సినిమాల్ని త్వ‌ర‌గా పూర్తి చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌తోనో షూటింగుల‌కు వ‌ద్దామ‌నుకుంటున్న హీరోలు ఇప్పుడు మ‌రింత భ‌య‌ప‌డే ప్ర‌మాదం ఉంది. బండ్ల కి క‌రోనా సినిమాల వ‌ల్ల రాలేదు. సెట్లో అడుగుపెట్ట‌డం వ‌ల్ల రాలేదు. కానీ.. త‌ను సినిమా వాడే. అందుకే… ఇప్పుడు చిత్ర‌సీమ‌లో అంత క‌ల‌క‌లం. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా, క‌రోనా ఏదో ఓ రూపంలో మ‌నిషికి క‌బ‌ళిస్తుంద‌న్న భ‌యాలు సినిమా వాళ్ల‌లో ఎక్కువ అవుతున్నాయి. క‌రోనాకి సెల‌బ్రెటీ – నాన్‌సెల‌బ్రెటీ అనే తేడా లేదు. కాస్త అద‌మ‌ర‌చినా వాలిపోతుంది. సెట్లో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా, క‌రోనాని అట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌న్న అభిప్రాయానికి హీరోలు వ‌చ్చేస్తే – ఇక సినిమా షూటింగులు ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఊపందుకోవు. ఓర‌కంగా బండ్ల‌కు క‌రోనా అన్న వార్త‌.. టాలీవుడ్ లో డేంజ‌ర్ బెల్స్ మోగించిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close