ఇంజినీరింగ్ ఫీజులూ మార్చలేకపోయిన ఏపీ ప్రభుత్వం..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ ఫీజుల్లో మార్పు లేదు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన కొత్త ఫీజుల ఉత్తర్వల జీవో నిలిపివేతను.. సుప్రీంకోర్టు సమర్థించింది. 2019-20 విద్యా సంవత్సరానికిగాను ఎఎఫ్‌ఆర్‌సి సూచించిన విధంగానే ఇంజినీరింగ్‌ ఫీజులు వసూలు చేయాలని ఆదేశించింది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నత విద్య ఫీజుల్లో మార్పులు చేసేందుకు ప్రత్యేకంగా కమిటీ నియమించింది.ఆ కమిటీ వివిధరకాల పరిశీలనలు జరిపి ఫీజులు ఖరారు చేసింది. అయితే.. ఇంజినీరింగ్ యాజమాన్యాలు.. అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ 2019 నుంచి 2022 విద్యాసంవత్సరాలకు గతంలో ఫీజులు సిఫార్సు చేసిందని.. ఆ గడువు పూర్తి కాకుండా.. కొత్త ఫీజులు నిర్ణయించడం కరెక్ట్ కాదని కోర్టుకెళ్లాయి.

ఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసు చేసిన ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టడం చట్ట విరుద్ధమన.ి. ఇంజినీరింగ్ కాలేజీలు వాదించాయి. మొదట… వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ జీవోను నిలిపివేస్తూ.. ఎఎఎఫ్‌ఆర్‌సీ సిఫారసుల మేరకే ఫీజులు వసూలు చేయాలని ఆదేశించింది. అయితే.. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులోనే డివిజన్ బెంచ్ వద్ద సవాల్ చేసింది. దీంతో డివిజన్ బెంచ్.. తీర్పులో మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తీర్పును .. 23 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. 2019-20 నుంచి మూడేళ్లకు ఏఎఫ్ఆర్‌సీ సిఫారసు చేసిన ఫీజులనే అమలు చేయాలని కోరాయి. సుప్రీంకోర్టు సింగిల్‌ జడ్జి ఉత్తర్వులనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో.. ప్రభుత్వం ఆదేశించిన కొత్త ఫీజులు అమలు చేయడం సాధ్యం కాదు.

వైసీపీ సానూభూతి పరులకు చెందిన ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాలు తక్కువగా ఉన్నప్పటికీ.. అత్యధిక ఫీజులు.. ఇతరుల కాలేజీల్లో తక్కువ ఫీజులను ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయించిందని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆరు కాలేజీల్లో మాత్రమే.. గరిష్ఠంగా రూ.70వేలు ఫీజు ఖరారు చేశారు. శ్రీవిద్యానికేతన్‌ , , పీవీపీ సిద్ధార్థ , జీపీఆర్‌ కర్నూలు వంటి కాలేజీలకే చాన్స్ దక్కింది. ప్రసిద్ధమైన ఇతర కాలేజీలకూ.. తక్కువ మొత్తంలో ఫీజు ఖరారు చేశారు. ఇప్పుడు వాటిని సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో గత ఏడాది ఫీజులనే వసూలు చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close