“ఉస్మానియా” పాపం ప్రతిపక్షాలదేనా..?

ఉస్మానియా ఆస్పత్రి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారింది. బుధవారం పడిన వర్షానికి ఉస్మానియా మొత్తం నీళ్లు నిండిపోవడం.. చికిత్స గదుల్లో కూడా నీరు చేరడంతో.. విపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ఐదేళ్ల క్రితం.. అంటే 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఆస్పత్రిని పరిశీలించి… రెండు, మూడేళ్లలో కూలిపోయే పరిస్థితిలో ఉందని.. తక్షణం కూలగొట్టి.. కొత్త నిర్మాణం చేస్తామని ప్రకటించారు. దానికి సంబంధించిన వీడియోలను బయట పెట్టిన విపక్ష పార్టీలు…, ఇప్పుడు.. హుటాహుటిన కూలగొడుతున్న సచివాలయం విషయాన్ని లింక్ పెట్టి విమర్శలు గుప్పిస్తున్నాయి. ఐదేళ్లలో .. ఉస్మానియాను కట్టి తీరుతామని కట్టలేదు కానీ…మూడు నెలల్లో గడీని కట్టుకున్నారని.. కొత్త సచివాలయం కడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.

కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలంతా ఉస్మానియాను సందర్శించారు. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ప్రాణాలను బలి పెడుతున్నారని మండిపడ్డారు. అయితే.. విపక్షాల విమర్శలకు.. అధికార పార్టీ నుంచి అనూహ్యమైన కౌంటర్ వచ్చింది. ఉస్మానియా ఆస్పత్రిని కొత్తగా కట్టకుండా ఆపింది విపక్షాలేనని.. టీఆర్ఎస్ ఎదురుదాడి ప్రారంభించింది. అసలు విషయం ఏమింటే.. ఉస్మానియా ఆస్పత్రి హెరిటేజ్ భవనం అని దానిని కూలగొట్టవద్దని.. సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పుడే కోర్టులకు వెళ్లాయి. అదే విషయాన్ని ఇప్పుడు టీఆర్ఎస్ హైలెట్ చేస్తోంది. విపక్షాల వల్లే ఉస్మానియా ఆస్పత్రికి ఈ దుస్థితి వచ్చిందని.. చెప్పడం ప్రారంభించారు. విపక్ష నేతలు ఉస్మానియాను సందర్శించడం పూర్తయిన తర్వాత మంత్రి తలసాని కూడా వెళ్లారు.

పేదల కోసం 27ఎకరాల్లో ఉస్మానియాను పునర్మిస్తామంటే ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లాయని తప్పుబట్టారు. హెరిటేజ్ భవనం అయితే ఉస్మానియాను బాగుచేయకూడదా? అని ప్రశ్నించారు. ప్రఆసుపత్రిలోకి నీళ్లు వచ్చినంత మాత్రానా హంగామా చేస్తారా అంటూ.. ఉస్మానియాలో పరిస్థితిని తేలికగా తీసుకున్నారు. అయితే.. విపక్ష పార్టీలు మాత్రం.. ప్రగతి భవన్‌ను ఎలా నిర్మించారని.. ప్రస్తుతం.. సచివాలయాన్ని ఎలా కూలగొడుతున్నారనిప్రశ్నిస్తున్నారు. వాటిపై కూడా చాలా మంది కోర్టుకు వెళ్లినా.. అన్నింటినీ అధిగమించి కట్టుకుంటున్నారని.. ఉస్మానియా విషయంలో మాత్రం ఎందుకు న్యాయపోరాటం చేయలేదని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి.. ప్రస్తుతం ఉస్మానియా దుస్థితికి కారణం మీరంటే.. మీరని.. అధికార ప్రతిపక్ష పార్టీలు వాదించుకుంటున్నాయి. కానీ రోగులు మాత్రం వారి అవస్థలు వారు పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ కు నోటీసులు అంతా తూచ్..!!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు విషయంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయంలో ఢిల్లీ పోలిసుల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులే అందలేదు....

ఈవెంట్ కంపెనీ నిర్వాకం.. నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వ‌ల్ల‌, నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు మేట‌ర్...

క్రిష్ పేరు మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అది కూడా ఓకే. అయితే షాకింగ్ ఏమిటంటే......

పాయకరావుపేట రివ్యూ : వంగలపూడి అనితకు కలిసొస్తున్న కాలం !

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close