వీళ్లకే రెండు ఎమ్మెల్సీలు.. రెండు మంత్రి పదవులు..!

ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులకు.. రెండు మంత్రి పదవులకు పేర్లను సీఎం జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల పేర్లను రాజ్‌భవన్‌కు పంపారు. 22వ తేదీన మధ్యాహ్నం మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రెండు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలో ఖరారు చేశారు కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఎమ్మెల్సీలుగా.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మోషేన్ రాజు, కడప జిల్లాకు చెందిన మహిళా నేత జకియాఖానుం పేర్లను ఖరారు చేశారు. రాయచోటిలో ముస్లిం జనాభా అధికం. అక్కడ ఒకరికి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని జగన్ అనేక సార్లు హామీ ఇచ్చారు. ఇప్పుడు అవకాశం ఇచ్చారు. కొయ్యే మోషేన్ రాజు..వైసీపీలో చాలా కాలంగా ఉన్నారు.

మొదట్లో మోషేన్ రాజు పేరు ఎక్కువగా వినపించినా.. తర్వాత మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు పేరు ప్రచారంలోకి వచ్చింది. గత ఎన్నికలకు ముందు టీడీపీలో ఎంపీగా ఉన్న రవీంద్ర బాబు..వైసీపీలో చేరారు., అయితే ఆయనకు ఎంపీ టిక్కెట్ కానీ.. ఎమ్మెల్యే టిక్కెట్ కానీ ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్సీనో రాజ్యసభ టిక్కెటో ఇస్తమని హామీ ఇచ్చారు. ఈ కారణంగా ఆయన కూడా.. ఒత్తిడి తీసుకు వచ్చారు. ఓ దశలో ఆయన పేరును పరిశీలించినప్పటికీ.. చివరికి మోషేన్ రాజు వైపే మొగ్గారు. అలాగే.. చిలుకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ పేరును కూడా పరిశీలించారు. మొదట్లోనే ఆయన పేరును పక్కన పెట్టారు.

ఇక మంత్రి పదవులకు… తూ.గో జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ… శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజులకు ఖరారు చేశారు. వీరిద్దరూ.. రాజీనామా చేసిన పిల్లి సుభాష్, మోపిదేవి సామాజికవర్గాలకు చెందినవారే. అయితే గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి స్థానాన్ని శ్రీకాకుళం జిల్లాతో భర్తీ చేశారు. దీని వల్ల గుంటూరు జిల్లాకు ఓ పదవి తగ్గిపోయింది. వీరి పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. ఇరవై రెండో తేదీన ప్రకటించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close