సచివాలాయంపైనే పూర్తి సమయం వెచ్చిస్తున్న కేసీఆర్..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదైనా ఒక అంశాన్ని టేకప్ చేస్తే.. దానిపైనే పూర్తి సమయం కేటాయిస్తారు. ఇప్పుడు ఆయన కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం డిజైన్లపై దృష్టి పెట్టారు. ఇప్పటికే పలుమార్లు గంటల తరబడి…సమీక్షలు చేసిన ఆయన…మంగళవారం మరోసారి సమీక్షలు చేయనున్నారు. అవసరమైన మార్పులు చేర్పులు చేయనున్నారు. ఇప్పటి వరకూ ఉన్న ప్లాన్ ప్రకారం.. కేసీఆర్ అదృష్ట సంఖ్య ఆరు కలసి వచ్చేలా ఆరు అంతస్తులు… కట్టాలని అనుకున్నారు. కానీ… ఇప్పుడు మరో అంతస్తు చేరుస్తున్నారు. ఏడు అంతస్తులు కట్టి.. సీఎంవో … ఏడో అంతస్తులో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

నిజానికి… సచివాలయం కూల్చివేత ప్రారంభమైన రోజే… కొత్త డిజైన్ ను తెలంగాణ సర్కార్ మీడియాకు పంపింది. అదే ఫైనల్ అని అనుకున్నారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ హాఫిజ్ కాంట్రాక్టర్ దాన్ని డిజైన్ చేశారు. కానీ… అది ప్రాథమిక డిజైన్ మాత్రమే. దానిపై కేసీఆర్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇతర ఆర్కిటెక్ట్‌ల నుంచి ఆలోచనలు ఆహ్వానిస్తున్నారు. ఇలా చెన్నైకు చెందిన ఓ ఆర్కిటెక్ట్… అన్ని రకాల వాస్తు సలహాలతో.. ఏడు అంతస్తుల డిజైన్ ను అధికారులకు పంపినట్లుగా తెలుస్తోంది. అది కేసీఆర్ కు కూడా నచ్చడంతో దానిపై సమీక్ష చేయనున్నారు.

కరోనా సమయంలో… ప్రజల ప్రాణాలు కాపాడేందుకు… సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో సమయం వెచ్చించాల్సింది పోయి.. కొత్త సచివాలయం అంటూ. .. కాలయాపన చేయడం ఏమిటని… విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే… కేసీఆర్ ఇప్పుడు అలాంటివేమీ పట్టించుకోవడం లేదు. తెలంగాణలో వైరస్ విస్తరణ తగ్గిందని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. వెయ్యిలోపే కేసులు నమోదవుతున్నాయి. కరోనా కారణంగా.. ఇతర అంశాలను ఆపాల్సిన అవసరం లేదని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. చరిత్రలో తెలంగాణ సచివాలయం నిలిచిపోయేలా నిర్మాణం ఉండాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close