కేంద్ర విద్యావిధానం ధిక్కరణకు దారి చూపిన తమిళనాడు సీఎం..!

కేంద్ర ప్రకటించిన జాతీయ విద్యావిధానంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి కానీ.. తమిళనాడులో మాత్రం నిరసనలు ఎగసిపడుతున్నాయి. ఎందుకంటే.. విద్యావిధానంలో త్రిభాషా విధానాన్ని ప్రతిపాదించారు. ఆ త్రిభాషల్లో హిందీ ఉంది. అక్కడ హిందీ వ్యతిరేకత ఉద్యమాలు నడిచాయి. హిందీ తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని తమిళనాడు ప్రజలు మండిపడుతున్నారు. తమిళం అస్థిత్వాన్ని దిగజార్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపిస్తున్నారు. ప్రజల మనోభావాలను గుర్తించిన తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి.. తాము.. జాతీయ విద్యావిధానాన్ని అంగీకరించడం లేదని ప్రకటించారు. త్రిభాష సిద్దాంతాన్ని మార్చాలని నేరుగా ప్రధానినే డిమాండ్ చేస్తున్నారు.

కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఉన్న తమిళనాడు పళనిస్వామినే నేరుగా.. జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకించడంతో ఇప్పుడు అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డిపై పడింది. ఎందుకంటే.. ఆయనకు కూడా.. ఈ విద్యావిధానం నచ్చడం లేదు. ఆంధ్రుల మాతృభాష అయిన తెలుగును ఎత్తేసి ఒక్క ఇంగ్లిష్ మీడియంను మాత్రమే ఆయన పాఠశాలల్లో ఉంచాలనుకుంటున్నారు. దానికి కేంద్ర విద్యావిధానం గండికొట్టింది. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్య తప్పనిసరి చేసింది. ఆ తర్వాత విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ .. తాము ఇంగ్లిష్‌కే కట్టుబడి ఉన్నామని ప్రకటించారు కానీ.. కేంద్ర విధానాన్ని ధిక్కరిస్తామని మాత్రం చెప్పడం లేదు.

అయితే.. ఇక్కడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల ధిక్కార స్వరాల మధ్య కాస్తంత తేడా ఉంది. తమిళనాడు సీఎం తమ మాతృభాష కోసం పోరాడుతున్నారు. కానీ ఏపీలో మాత్రం.. మాతృభాషను అంతం చేయడానికి ధిక్కరించే ప్రయత్నం చేస్తున్నారు. రెండు ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్యనే ఇంత తేడా ఉంది. తమిళం జోలికి వస్తే.. అక్కడి ప్రజలకు కులమతాలు.. పార్టీలు ఉండవు. వారంతా తిరగబడతారు. కానీ ఏపీలో భాషకు కూడా కులం అంటగట్టేసే రాజకీయాలు నడుస్తున్నాయి. జనం కూడా… తెలుగు బాష ఓ కులానిదే అనుకునేలా ప్రచారం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల ప్రజలకు ఉన్నంత కనీస మాతృభాషా మమకారం కూడా ఆంధ్రుల్లో లేదనే విమర్శలు అందుకే వస్తూంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close