కొత్త పాలసీ : ఏపీలో పరిశ్రమలు పెట్టేవారికి రాచబాట..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేస్తోంది. పరిశ్రమలు పెట్టాలనుకునేవారి… అనేకానేక ప్రోత్సాహకాలతో కొత్త పాలసీ ప్రవేస పెట్టింది. భారీగా పెట్టుబడులు పెట్టే వారికి భారీ రాయితీలు ఇవ్నున్నారు. వచ్చే మూడేళ్ల కోసం పాలసీని ప్రకటించారు. ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం.. అదనపు ప్రోత్సహకాలు కల్పించారు. పెట్టుబడులు పెట్టినవారు నష్టపోకుండా పూర్తిగా హ్యాండ్‌ హోల్డింగ్‌ అందించే విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశ పెడుతోంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ప్రకటించారు. 10 మందికి ఉపాధి కల్పించేలా మహిళా పారిశ్రామికవేత్తలు పరిశ్రమ పెట్టేందుకు ముందుకు వస్తే వారికి సగం ధరకే భూమి, స్టాంప్‌ డ్యూటీ నుంచి మినహాయింపు, ఐదేళ్లపాటు విద్యుత్‌ సబ్సిడీతోపాటు అనేక రాయితీలు కల్సిస్తారు. ఎంఎస్ఎంఈలకు 100 శాతం స్టాంప్‌ డ్యూటీ, ఐదేళ్లపాటు 100 శాతం ఎస్‌జీఎస్టీ కూడా మినహాయింపు ఇస్తున్నారు. వడ్డీ రాయితీ, విద్యుత్‌ సబ్సిడీ, నాలా చార్జీల్లో కూడా రాయితీ వస్తుంది. ఇక 2 వేల మందికిపైగా ఉపాధి కల్పించే పరిశ్రమలకు వంద శాతం.. వెయ్యి నుంచి రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తే 75 శాతం.. 1,000 మంది వరకు ఉపాధి కల్పిస్తే 50 శాతం జీఎస్టీ నుంచి మినహాయింపు ప్రకటించారు.

ఇక భారీ పెట్టుబడులకు అనుగుణంగా అదనపు రాయితీలు ఇస్తున్నారు. పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు కేటాయిస్తారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించాలనే నిబంధన తెచ్చినందున… స్కిల్డ్ లేబర్ కోసం.. కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అందుకే అలాంటి పరిస్థితి లేకుండా.. 30 నైపుణ్య శిక్షణ కేంద్రాలు, రెండు స్కిల్డ్‌ వర్సిటీలు, డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ని ఏర్పాటు చేస్తారు. పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు “వైఎస్సార్ ఏపీ వన్” పేరిట సింగిల్‌ విండో కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close